మోదీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దానిని మరింత తీవ్ర తరం చేసేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న టోల్ బూత్ ల వద్ద సైన్యాన్ని మోహరించడాన్ని ఆమె తీవ్రంగా నిరసిస్తోంది. వారిని ఉపసంహరించుకుంటేనే తాను కార్యాలయం నుంచి కదలుతానని భీష్మించుకుని గురువారం రాత్రి అంతా అక్కడే కూర్చుంది.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా టోల్ గేట్ ల వద్ద సైన్యాన్ని నియమించడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. "ఇది సైనిక తిరుగుబాటా?" అని ప్రశ్నించిన ఆమె, సైన్యం మాక్ డ్రిల్ చేయాలని భావించినా, రాష్ట్రం అనుమతి తప్పనిసరని అన్నారు. సైన్యం వెళ్లిపోయేదాకా తాను ఇంటికి వెళ్లేది లేదని సచివాలయంలోని తన కార్యాలయంలో ఆమె రాత్రి నుంచి బైఠాయించారు. సామాన్యులకు తాను జవాబుదారీగా ఉన్నానని, రాత్రంతా తాను ఆఫీసులోనే ఉండి పరిస్థితిని చూస్తానని చెప్పిన ఆమె అన్నంత పనీ చేశారు.
ఆమె కార్యాలయానికి 500 మీటర్ల దూరంలోనే హుగ్లీ బ్రిడ్జ్ టోల్ బూత్ ఉంది. అక్కడా సైన్యం కాపలాకు దిగింది. అర్ధరాత్రి తరువాత హుగ్లీ బ్రిడ్జ్ నుంచి సైన్యం వెళ్లిపోయినా... మమత కదల్లేదు. ఇంకా 18 రాష్ట్రాల్లోని టోల్ బూత్ ల వద్ద సైన్యం కాపలా కాస్తోందని, వాళ్లంతా వెళ్లిపోవాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై మీడియాలో కథనాల ద్వారానే మమతా సమాచారం తెలుసుకోవటం విశేషం.
కాగా, టోల్ బూత్ ల వద్ద డబ్బులు చెల్లించక తప్పనిసరి పరిస్థితి నెలకొనడంతో, ప్రజలు నిరసనలకు దిగి, విధ్వంసం సృష్టించవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకే సైన్యాన్ని మోహరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు, సంబంధిత పోలీసులకు సమాచారం అందించాకే తాము రంగంలోకి దిగామని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశాడు. అసోంలోని 18 ప్రాంతాలు, అరుణాచల్ప్రదేశ్లో 13 ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో 6, నాగాలాండ్లో 5, మేఘాలయలో 5, త్రిపుర, మిజొరాంలలో ఒక్కో ప్రాంతంలో ఇలా బలగాలను మోహరించినట్లు చెబుతున్నారు. కాగా, మొత్తం ఆర్మీని ఉపసంహరిస్తేనే తాను ఆందోళన విరమిస్తానని మమత అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more