మహిళలపై అఘాయిత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. రైలులోని మహిళల కోచ్ లోకి మగవాళ్లు ఎక్కకూడదన్న నిబంధన వున్నా ఎక్కిన మగమదమృగాళ్లు.. మహిళల కంపార్టుమెంట్లలోకి చోరబడటంతో పాటు ఓ ప్రయాణికురాలపై అత్యాచారానికి పాల్పడ్డారు. తమ బంధువుల పెళ్లికి వెళ్తున్న ఓ మహిళపై ఈ దారుణం జరిగింది. కదులుతున్న రైలులో ఆమెపై దుండగులు దుర్మార్గానికి పాల్పడ్డారు.
ఆమె దగ్గర ఉన్న విలువైన వస్తువులను దోచుకోవడమే కాకుండా వారిలో ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని షాదారా నుంచి పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ మధ్య చోటుచేసుకుంది. అది కూడా మహిళల కోచ్లో. పోలీసుల వివరాల ప్రకారం పాత ఢిల్లీ స్టేషన్కు వెళ్లే రైలులోని ఓ మహిళల కోచ్ లో ఐదుగురు మహిళలు ఉన్నారు. అందులో నుంచి నలుగురు షాదారాలో దిగిపోగా ఒక 32 ఏళ్ల మహిళ మాత్రం అందులోనే ఉంది.
సరిగ్గా అక్కడే ముగ్గురు దుండగులు లేడీ కోచ్ లోకి వచ్చారు. ఆమె నుంచి విలువైన వస్తువులు దోచుకుని ఇద్దరు పారిపోగా ఒక దుండగుడు మాత్రంపై ఆమెపై చేయిచేసుకొని, దారుణంగా కొట్టి లైంగిక దాడికి దిగాడు. అయితే, ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. ఈ లోగా పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అతడిని షాబాజ్(25) అనే యువకుడిగా గుర్తించారు. బాధితురాలిది బిహార్. వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళుతుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. అయితే ఈ దురాగతం నేపథ్యంలో మహిళల కంపార్టుమెంట్లలో కూడా వారికి భధ్రత లేదని, పోలీసుల రక్షణ కూడా కరువైందని స్పష్టమవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more