ఏపీ అదికార పక్షం టీడీపీపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయంటూ పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా విమర్శలు కురిపించారు. ఉత్తరాంధ్ర, టీడీపీ ప్రజలు ఎందుకు దూరమౌతున్నారో అధికార పక్షం గుర్తించాలని అనంత సభలో జనసేన అధినేత ప్రశ్నించాడు. లేదంటే మరో ప్రాంతీయ ఉద్యమం వస్తుందని హెచ్చరించాడు. ఆదిలోనే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాలకు సూచించాడు. జనసేన ఆఫీస్ తో పాటు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడటం, గెలవటం అన్న విషయాన్ని పక్కన బెట్టి ఇక్కడి సమస్యలను ఢిల్లీకి చేరవేస్తానని, కదిలి వస్తే వచ్చేవారిని తనతోపాటు తీసుకెళ్తానని పవన్ చెప్పుకొచ్చాడు.
దొపిడీ వ్యవస్థకు పూర్తి విరుద్ధం జనసేన అని చెప్పిన పవన్, డబ్బుతో కూడిన రాజకీయాలంటే అసహ్యం అని చెప్పుకొచ్చాడు. దేశంలోనే కరువు ప్రాంతంగా మిగిలిపోయిన అనంతపురం నుంచే పోరాటంకి శ్రీకారం చుడతానని, దానికి అందరి సహకారం కావాలని టీడీపీలో పొలిటికల్ కరప్షన్ ఎక్కువైందన్న ఆరోపణల గురించి ప్రస్తావించిన పవన్, అభివృద్ధి అంటే సింగపూర్ తరహా హంగులు కాదని, పాలన పరంగా డెవలప్ మెంట్ ఉండాలంటూ విరుచుకుపడ్డాడు.
ప్రజలందరితో ఉన్నామని చెప్పాల్సిన ప్రభుత్వంపై ఈ ఆరోపణలు ఎందుకు? వస్తున్నాయో ఆత్మపరిశీలన చేసుకోండి. బంధుప్రీతి, మద్దతుదారుల ప్రీతి వదిలెయ్యండి. ప్రజలకు అండగా నిలవండి. అమరావతి నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వేరైపోయినట్టు ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి విభజన రాకుండా జాగ్రత్తపడండి. రాజధాని కేవలం డబ్బున్నవారికి మాత్రమేనా? లేక రాష్ట్ర ప్రజలందరిదీనా? రాజధాని ఎలా ఉండబోతోంది. మరోసారి ప్రజలందరికీ రాజధాని ఎలా ఉంటుందో చెప్పండి.
కరవు వల్ల ఆంధ్రపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు మీకు తెలుసా? అని ప్రభుత్వాలను ప్రశ్నించాడు. ఇక్కడ భూమి ఉండి కేవలం నీరులేక ఆత్మగౌరవం అమ్ముకొని బతుకుతున్నారు. మమ్మల్ని రక్షించేవారు ఎవరూ లేరని వారు ఆవేదన చెందుతున్నారు’ అని పవన్ అన్నాడు. దోపిడీ, మోసాలు ఇంకెన్నాళ్లని ప్రశ్నించారు. మోదీ, చంద్రబాబు, జగన్ ఎవరైనా తనకు ఒక్కటేనని, అదే సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదంటూ మండిపడ్డాడు.
‘నేను రైతు బిడ్డనే.. నేనూ కూలి పని చేశాను... ప్రభుత్వాలు తలుచుకుంటే అనంతపురాన్ని బాగు చేయగలవు. సత్యసాయిబాబా చేసిన పనిని ప్రభుత్వాలు ఎందుకు చేయవు? స్వచ్ఛంద సంస్థలు చేస్తోన్న పనిని ప్రభుత్వాలు ఎందుకు చేయగలగడం లేదు. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉంది. నాకు నటుడిగా ఆనందం లేదు. నాకు నిజమైన ఆనందం కలిగేది ప్రజల సమస్యలపై పోరాడినప్పుడే. మీకు నేను అండగా ఉంటాను.
చివర్లో కాస్త నిదానంగా మాట్లాడిన పవన్.. టీడీపీ అయినా, వైసీపీ అయినా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా అనంతపురం ను ఓటు బ్యాంకుగా కాకుండా, కరువు కోరల్లోంచి ఎలా బయటపడేయాలో ఆలోచన చేయడంటూ హితవు పలికాడు. కల్లూరి, లోక్ నాయక్ జయప్రకాశ్ లాంటి వారి స్పూర్తితో స్థాపించిన ఈ జనసేన పార్టీని మీ అందరి అండతో ముందుకు కొనసాగిస్తానంటూ జై హింద్ అంటూ ముగించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more