మనిషి తాను ప్రాణంగా చూసుకునే పెంపుడు జంతువు ఏదైనా దూరమైతే తట్టుకోలేక మంచాన పట్టడం, ప్రాణాలు వదలటం లాంటి ఘటనలు చూశాం. కానీ, జంతువులు తమ యజమాని దూరమైతే ఆ బాధను అనుభవించడం చాలా అరుదు. గతంలో హచికో అనే కుక్క తన యజమాని తిరిగి రాడని తెలిసి కూడా తొమిదేళ్లపాటు అతని సమాధి దగ్గరే గడిపిన గాథ తెలిసిందే. ఇప్పుడు అదే రీతిలో ఓ పిల్లి తన మానవ బంధం దూరం కావటంతో పిచ్చిదైపోయి ఆ సమాధి దగ్గరే జీవిస్తోంది.
ఇండోనేషియాలోని సెంట్రల్ జావాలో ఇబు కుందరి అనే వృద్ధురాలు ఓ పిల్లిని పెంచుకుంటుంది. ఏడాది క్రితం కుందరి అనారోగ్యంతో చనిపోయింది. ఆపై ఆమె కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికలో ఖననం చేశారు. శవాన్ని తీసుకెళ్లే సమయంలో ఆ పిల్లి కూడా వారి వెంట వెళ్లిందంట. ఇక అప్పటి నుంచి పిల్లి యజమానురాలిని ఖననం చేసిన సమాధి వద్దనే ఉంటుంది. ఆ సమాధినే పరుపుగా చేసుకుని పడుకుంటుంది. దొర్లుతుంది.. ఆడుకుంటుంది.
దానిని ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నించిన ప్రతీసారి తిరిగి మళ్లీ అక్కడికే వస్తోందని ఆ వృద్ధురాలి పిల్లలు చెబుతున్నారు. కానీ, క్రమం తప్పకుండా దానంతట అదే ఆ ఇంటికి వెళ్లి వారి పెట్టింది తిని తిరిగి సమాధి వద్దకు వచ్చేస్తోందట. శ్మశానవాటికలో ఉన్న ఆ పిల్లిని చూసి జాలిపడి ఏదైనా ఇస్తే అది తీసుకోవడం లేదట.
చివరకు కెలి ప్రేట్నో అనే 24 ఏళ్ల ఆమె పిల్లిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తే,,, పారిపోయి తిరిగి యజమాని సమాధి వద్దకే చేరిందంట. అయితే పిల్లి తన యజమానురాలి పట్ల చూపిస్తున్న ప్రేమ, విశ్వాసం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్త పరుస్తున్నారు. ఆ పిల్లి ఆ వృద్ధురాలినే అమ్మగా భావించింది. అందుకే ఆమె ఒడిని(సమాధి) విడిచి ఉండలేకపోతుంది. మానవ సంబంధాలు పూర్తిగా ఆర్థికంగా మారిపోతున్న ఈ వేళలో ఇలాంటి కథనాలు చదివినప్పుడు, చూసినప్పుడు మనసు కాస్త చెమ్మగిల్లి కుదుట పడుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more