ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తన స్వరాన్ని పెంచి, పోలీసులపై విరుచుకుపడ్డాడు. సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ పై పోలీసులు కట్టుకథలు చెబుతున్నారని ఒవైసీ ఆరోపించారు. భోపాల్ లో ఈ ఉదయం 8 మందిని టెర్రరిస్ట్ లను కేవలం 8 గంటల వ్యవధిలో ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ ను ఇనుప ప్లేట్లతో గొంతు కోసి చంపారనే జైలు సిబ్బంది చెప్పారు.
అయితే అండర్ ట్రయల్ ఖైదీలకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయని అసదుద్దీన్ ప్రశ్నిస్తున్నాడు. ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా అసదుద్దీన్ డిమాండ్ చేశారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను వారు ప్రతిఘటించడంతో ఎన్ కౌంటర్ చేయక తప్పలేదని పోలీస్ అధికారులు చెబుతుండటం తెలిసిందే.
అయినా అసదుద్దీన్ మాత్రం విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతున్నాడు. ఇలా మాట్లాడటం కొత్తేమీ కాదు కదా. వికారుద్దీన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాది గురించే సానుకూల వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం బాస్ కి ఉరి దాడి, సరిహద్దు ఉల్లంఘనలు కంటికి కనిపించడం లేదేమో! సరిహద్దులో పోయే జవాన్ల ప్రాణాల కన్న ఉగ్రరాక్షసుల ప్రాణాలే విలువగా కనిపిస్తున్నాయేమో!. సైనికులు చనిపోయినా దేశం మొత్తం స్పందిస్తుంటే... ఇప్పటిదాకా ఒక్క మాటా మాట్లాడలేదు. అదే ప్రజలను పొట్టనబెట్టుకునే మృగాలు చనిపోతే క్షణాల్లోనే స్పందించారు. అయినా ఐక్యతా దినోత్సవం రోజున కూడా చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన విచక్ష్క్షణ ప్రశ్నించే విధంగా ఉన్నాయనటంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయ్యా అసదుద్దీన్ సాబ్... మిమల్నేం సరిహద్దులకు వెళ్లి పోరాడమని కోరం... కానీ, అదే సమయంలో సైన్యం, పోలీసుల మనోస్థైర్యం దెబ్బతినేలా మీరు మాట్లాడొద్దనే మా విన్నపం.
చనిపోయిన వారంతా చాలా డేంజర్:
ఇక నలుగురికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఉత్తరప్రదేశ్ లోని బిజ్ నోర్ లో బాంబులు తయారు చేయడం నేర్చుకున్నారని తమ దర్యాప్తులో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. 2014 సెప్టెంబర్ 12న బిజ్ నోర్ లోని జాతన్ కాలనీలో ఒక ఇంట్లో పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో ఉంటున్న ఆరుగురు వ్యక్తులు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారు సిమి ఉగ్రవాదులే. అగ్గి పుల్లలకు ఉన్న మందును ఉపయోగించి పేలుడు పదార్థాలు తయారు చేసేవారు. ఆవిధంగా చేస్తున్నప్పుడే పేలుడు సంభవించిందనే విషయమై తమ విచారణలో వెల్లడైందని పోలీసులు చెప్పారు.
ఇక ఆరుగురు సభ్యుల్లో నలుగురు జకీర్, అంజద్, సల్లూ,మహబూబ్ లు ఈరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. మరో ఇద్దరు అస్లాం, ఈజాజ్ లు ఈ ఏడాది ఏప్రిల్ లో తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more