దీపావళి పర్యదినం రోజున భారత్ తన సత్తాను చాటింది. కాకతాళీయంగా కలసివచ్చిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నోమెంటులో టీమిండియా తన అద్భుత ప్రతిభను చాటింది. ఈ టోర్నీ ఆరంభం నుంచి అప్రతిహాత విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న టీమిండియా ఫైనల్స్ లో పాకిస్థాన్ పీచమణిచి టైటిల్ ను కైవసం చేసుకుంది.. ఆదివారం రాత్రి దాయాది పాకిస్థాన్ తో హోరాహోరీగా జరిగిన ఫైనల్లో భారత్ 3-2 స్కోరుతో విజయం సాధించింది. దీపావళి రోజున భారత హాకీ ఆటగాళ్లు ట్రోఫీ సాధించి భారతీయులకు కానుకగా అందించారు.
భారత హాకీ జట్టు అభిమానుల అంచనాలను తలకిందులు చేసింది. అభిమానుల ఊహాలకు కూడా అందని విధంగా టోర్నీలో రాణించడంతో ఫైనల్ మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ పెరిగింది. దీంతో ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. భారత ఆటగాడు రూపిందర్ పాల్ సింగ్ తొలి గోల్ సాధించి జట్టుకు శుభారంభం అందించాడు. 23వ నిమిషంలో భారత ఆటగాడు అఫాన్ యూసుఫ్ మరో గోల్ చేయడంతో ఆధిక్యం 2-0కి పెరిగింది. కాగా ఆ తర్వాత పాక్ వరుసగా రెండు గోల్స్ చేయడంతో ఇరు జట్ల స్కోర్లు 2-2తో సమమయ్యాయి.
ఈ దశలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా, నికిన్ తిమ్మయ్య గోల్ చేయడంతో భారత్ మళ్లీ 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పాక్ ఆటగాళ్లు గోల్ చేయలేకపోయారు. భారత్ మ్యాచ్తో పాటు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఓవరాల్గా భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీని గెలవడమిది రెండోసారి. భారత హాకీ జట్టుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ, సనీ, క్రీడా ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఇక నెట్ జనులు కూడా టీమిండియా హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more