భారత మాతను, మాత ముద్దుబిడ్డలను శత్రు సేనల నుంచి అనునిత్యం కాపాడుతున్న జవాన్ల సేవలను దేశప్రజలందరూ కొనియాడాలని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ దీపావళి పండగ పర్వదినాన్ని పురస్కరించుకని సరిహద్దులోని సైనిక బలగాలకు సందేశాలు పంపిన దేశ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశప్రజలను ఉద్దేశించి 25వ సారి తన మనస్సులోని మాట 'మన్ కీ బాత్'లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. తొలుత దేశప్రజలందరికీ ఆయన దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
దేశప్రజలు ప్రశాంతంగా, ఉత్సాహంగా దీపావళి వంటి పండుగలు చేసుకోగలుగుతున్నామంటూ ఏడాది పొడవునా సరిహద్దుల్లో రక్షణగా నిలుస్తున్న జవాన్లే కారణమని, సాయుధ దళాలకు ఈ దీపావళి అంకితమని అన్నారు. కొద్ది నెలలుగా జవాన్లు తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారని, వారిని స్మరించుకుంటూ మనమంతా ఈ దీపావళిని జరుపుకొందామని ప్రధాని అన్నారు. వీరజవాన్ల స్మృత్యర్థం భారత సాయుధ దళాలు ఉన్న ప్రతి యూనిట్ వద్ద ఒక్కో దీపం వెలిగించాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు.
సాయుధ దళాల సేవలను ప్రధాని గుర్తు చేస్తూ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ, నావికాదళం, వాయుసేన, జవాన్లు దేశప్రజలందరికీ రక్షణగా నిలుస్తున్నందునే మనం ఈ రోజు ఇంత సంతోషంగా దీపావళి పండుగ జరుపుకొంటున్నామని తెలిపారు. సైనికుల నిష్కలంక ప్రేమ, త్యాగాలు చిరస్మరణీయమన్నారు. సైనికులందరికీ దీపావళి శుభాకాంక్షలు పంపాలను ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను కూడా మోదీ గుర్తు చేశారు. సర్దార్ పటేల్ జయంతి (అక్టోబర్ 31)ని ఏక్తా దివస్గా జరుపుకొంటున్నామని, ఈ సందర్భంగా ప్రజలంతా ఐక్యతా ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
పరిశుభ్రతతో ముడిపడిన పండుగ దీపావళి అని, ప్రతి ఒక్కరూ తన ఇళ్లను పరిశుభ్రం చేసుకోవడంతో పాటు చుట్టుపక్కలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా దీపావళి వేడుకను ఎంతో వేడుకగా జరుపుకొంటున్నారని చెప్పారు. కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడెయు దీపావళి సందర్భంగా దీపం వెలిగిస్తున్న ఫోటోను ట్వీట్ చేశారని, బ్రిటన్ ప్రధాని థెరెసా మే దీపావళి వేడుకల రెసెప్షన్ ఇస్తున్నారని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more