ఇండియన్ ఆర్మీకి ఈ దీపావళి నిజంగానే వెలుగులు తీసుకువస్తుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ వినతితో ఆర్మీకి దేశ ప్రజల నుంచి దీపావళి శుభాకాంక్ష్లలు వెల్లివిరుస్తుండగా, తాజాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యువనేత రాహుల్ గాంధీ భారత సైనిక దళాలకు మద్దుతుగా నిలిచారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఆర్మీకి ఈ దీపావళి శుభాకాంక్షలు తెలిపి.. మీకు మద్దతుగా యావత్ దేశం నిలబడిందన్న సందేశాన్ని ఇవ్వాలని కోరిన విషయం తెలిపిందే. అయితే శుభాకాంక్షలతో పనులు నామమాత్రమేనని, వారి జీవితాలలో వెలుగులు నింపాలని ప్రధానిని డిమాండ్ చేస్తున్నారు.
నిత్యం ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని విమర్శంచే రాహుల్.. ఆయన దృష్టికి ఆర్మీ సభ్యుల వినతిని తీసుకెళ్తూనే ఆయను విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ మనోభావాలను దెబ్బతీస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ విరుచుకుపడ్డారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్వోపీ) విధానాన్ని అర్థవంతంగా అమలుచేయాలని, సైనికులు తమ పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని ప్రధాని నరేంద్రమోదీని కోరుతూ రాహుల్ లేఖ రాశారు.
అనుక్షణం దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల సంక్షేమాన్ని బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ తో శత్రుసేనల పీచం అణచగలమని భారత ఆర్మీ నిరూపించిన కొద్ది రోజులకే కేంద్రం వారి అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ లో కొత్తగా స్లాబ్ విధానంగా మార్చారు. దీనివల్ల గాయపడిన సైనికులకు అందే పెన్షన్ లో ఘననీయమైన మార్పులున్నాయని.. అవి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదముందని ఆయన అందోళన వ్యక్తం చేశారు. పౌర ఉద్యోగులతో పోలిస్తే సైనికలకు వేతనం విషయంలో ఎంతో వివక్ష, వ్యత్యాసం కనిపిస్తోందని రాహుల్ గాంధీ లేఖలో పేర్కోన్నారు. ఈ తప్పులను సరిచేసి సైనికుల జీవితాలలో ఈ దీపావళి నుంచి వెలుగులు నింపాలని కోరారాు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more