దీపావళి అనగానే లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తట్టాలని రకరకాల పూజలు చేస్తూ.. దేవతను అహ్వినస్తూ ఇంటిని, ఇంటి అవరణను కూడా శభ్రంగా చేసి అమ్మవారిని అహ్వనిస్తూ దీపాలను, విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేస్తుంటాం. అయితే ఇవేమీ చేయకున్న లక్ష్మీదేవీ ఓ రిక్షావాలా జీవితంలో వెలుగుల్ని నింపుతుంది. సుమారు నలభై ఏళ్లుకు పైబడిన వ్యక్తి జీవితంలో ఈ దీపావళి కొత్త వెలుగుల్ని పంచుతుంది. ఇందుకోసం తన పనిని తాను చేయడమే ఆ రిక్షావాలా చేసిన పని.
నిత్యం ఎంతో మంది కస్టమర్లను చూసిన రిక్షావాలా.. అతను కూడా అలానే వచ్చాడని భావించాడు. సాధారణ కస్టమర్ మాదిరిగానే అతన్ని తీసుకోచ్చాడు. అతను ఏకంగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లమని అదేశించడంతో.. కొద్దిగా అలోచనలో పడ్డాడు. ఆ తరువాత అతన్ని కలవడానికి ముఖ్యమంత్రే ఇంటిబయటకు రాగానే ఖంగుతిన్నాడు. అదే అతనికి అదృష్టాన్ని తీసుకోచ్చి పెట్టింది. అతనెవరో కాదు పేటీయం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ. సాక్షాత్తు ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ను కలిసేందుకు బయలుదేరిన పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ కూడా ఇలాగే ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు.
దీంతో ఆయన తన కారును కాదని రిక్షాను అశ్రయించాడు. దేశంలోనే టాప్ మొబైల్ వ్యాలెట్ స్టార్టప్ అధినేత ఇలా రిక్షాలో రావడంతో సీఎం అఖిలేశ్ ఒకింత విస్తుపోయారు. దీంతో తాను- సీఈవోతోపాటు రిక్షా కార్మికుడు ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘నగరంలోని ట్రాఫిక్ స్తంభించిపోవడం వల్ల పేటీఎమ్ సీఈవో విజయ్ రిక్షా సైకిల్లో రావాల్సి వచ్చింది. మెట్రో రాకతోనే లక్నోలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి’ అని అఖిలేశ్ పేర్కొన్నారు. దీంతో విషయం బాహ్యప్రపంచానికి తెలిసింది.
రిక్షా కార్మికుడికి కొత్త రిక్షా అందిస్తానని, దాంతో పాటు సొంతింటి కలను కూడా తీరుస్తానని స్వయంగా ముఖ్యమంత్రే మణిరామ్ హామి ఇచ్చారు. ఇక సీఈఓను తీసుకువచ్చినందుకు గాను ఆరు వేల రూపాయల నగదును రివార్డుగా అందించారు ముఖ్యమంత్రి అఖిలేష్. ఇక, రిక్షా సవారీ చేసిన పీటీఎం అధినేత విజయ్.. ఆ కార్మికుడికి నేరుగా డబ్బు ఇచ్చారా? లేక పేటీఎం ద్వారా ఈ-పేమెంట్ చేశారా? అని నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more