ఏకాంతంగా ఉన్న సమయంలో టాప్ లెస్ ఫోటోలు తీయటమే కాదు... వాటిని తమ మ్యాగ్జైన్ లో ప్రచురించినందుకు ఆరుగురు జర్నలిస్టులు ఇప్పుడు పశ్చాత్తాప పడబోతున్నారు. వారిపై కేసు నమోదు కావటమేకాదు, సుదీర్ఘ వాదనల తర్వాత ఏకంగా హైలెవల్ లో ఓ కమిటీతో విచారణ జరగబోతుంది. నేరం రుజువైతే వారందరికీ కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. ఇంతకీ ఆ ఫోటోలు ఎవరివి? ఏమా కథ అంటే...
బ్రిటన్ ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్సెస్ (డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్) కేట్ మిడిల్ టన్ లు నాలుగేళ్ల క్రితం హాలిడే కోసం దక్షిణ ఫ్రాన్స్ లోని ఓ ప్రాంతానికి వెళ్లారు. మూడో మనిషి కూడా అడుగుపెట్టలేని ఆ భవంతి పోర్టికోలో వీరిద్దరూ చనువుగా ఉన్న సమయంలో క్లోజర్ మేగజీన్ కు చెందిన జర్నలిస్టులు రహస్యంగా ఫొటోలు తీశారు. టాప్ లెస్ గా ఉన్న కేట్ విలియమ్స్ మసాజ్ చేసినట్లు ఆ ఫోటోలు ఉన్నాయి. జూమ్ కెమెరాతో ఆ భంగిమలను, ఆమె టాప్ లెస్ ఫొటోలను కెమెరాలో బంధించారు.
ఆ తర్వాత ఆ ఫొటోలను కవర్ పేజ్ పై ముద్రించి మేగజీన్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. అంతేకాదు ఆ ఫోటోలు ఆ తర్వాత యూరప్ లోని అన్ని ప్రముఖ మాగ్జైన్ లలో, పత్రికలో దర్శనమిచ్చాయి. దీనిపై బ్రిటన్ రాచకుటుంబం భగ్గుమంది. సీక్రెట్ గా ఫొటోలు తీయడమే కాకుండా, వాటిని ప్రచురించి ఇంకా పెద్ద తప్పు చేశారంటూ కేట్ మిడిల్టన్ తరపున లాయర్ల ఫ్రెంచ్ కోర్టులో వాదించారు. దీంతో, మేగజీన్ ఎడిటర్, ఓ సీనియర్ జర్నలిస్ట్, ఇద్దరు ఫొటో జర్నలిస్టులు, మరో ఇద్దరు ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్టులతో సహా.ఆరుగురిపై విచారణకు సర్వం సిద్ధమైంది.
నాలుగేళ్ల క్రితం టాప్ లెస్ ఫొటోల వ్యవహారంలో ఫ్రెంచ్ కోర్టు విచారణను ఇప్పుడు వేగవంతం చేసింది. వచ్చే జనవరి నుంచి విచారణ జరుగుతుందని ఫ్రెంచ్ న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, రాజకుటుంబానికి జర్నలిస్టుల సెంటిమెంట్ అస్సలు అచ్చీరాలేదు. 1997లో ప్రిన్సెస్ డయానా ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే స్కూటర్లపై ఆమెను వెంబడిస్తున్న ఫోటోగ్రాఫర్ల చెర నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆమెకు ఆ ప్రమాదం జరిగిందని చెబుతుంటారు.
అలాగే 2009లో విలియమ్ గర్ల్ ప్రెండ్ గా ఉన్న సమయంలో కేట్ టెన్నిస్ ఆడుతున్న ఫోటో ఒకటి ప్రచురించి ఓ మీడియా ఏజెన్సీ విమర్శలు ఎదుర్కోగా, ఆపై 5000 పౌండ్ల నష్టపరిహారంతో ఆ వివాదం సద్దుమణిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more