బ్రిటీష్ కాలం నుంచి మొదలైన సాంప్రదాయానికి ఎన్టీయే ప్రభుత్వం మంగళం పాడింది. గడచిన 92 సంవత్సరాల నుంచి సాధారణ బడ్జెట్ కు ముందు పార్లమెంట్ లో చేసే రైల్వే బడ్జెట్ సందడి ఇకపై కనిపించదు. ఈ మేరకు 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి సాధారణ బడ్జెట్ లోనే రైల్వే బడ్జెట్ ను కూడా కలిపేసే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మీదట ఒకే బడ్జెట్ ఉంటుందని కేబినెట్ మీటింగ్ తర్వాత ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం సాధారణ బడ్జెట్లోని ప్రధాన రంగాల్లో రైల్వేని కూడా చేరుస్తారు. దీంతో రైల్వేస్ కన్వెన్షన్ కమిటీ కూడా రద్దవుతుంది. రైల్వే రెవెన్యూ లోటు, మూలధన వ్యయాన్ని ఆర్థిక శాఖకు బదిలీ చేస్తారు. బడ్జెట్ లో ఉండే ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలను కూడా విలీనం చేసినట్లు జైట్లీ వెల్లడించారు
ఆదాయం తగ్గి, మూలధన వ్యయాలు పెరిగాయన్న కారణాలు చూపుతూ, రైల్వే శాఖను ఆర్థిక శాఖ పరిధిలోకి తేవాలని గత కొద్ది కాలంగా కేంద్రం ప్రతిపాదిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1న రైల్వే, కేంద్ర బడ్జెట్ లను కలిపి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇక రెండు బడ్జెట్ల విలీనానికి పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి వుంది. జనవరి 25లోగా ఈ పని పూర్తయితేనే, ఫిబ్రవరి 1న సంయుక్త బడ్జెట్ పార్లమెంట్ ముందుకు వచ్చే వీలుంటుంది.
అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీల మార్పునకూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 25లోపే బడ్జెట్ సెషన్ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో మూడు వారాల ముందుగానే అంటే అక్టోబర్ మొదటి వారం నుంచే బడ్జెట్ ప్రక్రియ మొదలవుతుంది. డిసెంబర్ 25లోపు బడ్జెట్పై భాగస్వాములందరితోనూ సంప్రదింపుల ప్రక్రియ ముగుస్తుంది. జనవరి 7 లోపు గణాంకాల శాఖ జీడీపీ అంచనాలు కూడా పూర్తవుతాయి.
పుట్టుపూర్వోత్తరాలు
1920లో భారత్ లో రైల్వే ఆధునీకరణ, అభివృద్ధి కోసం బ్రిటీష్ ఆర్థిక నిపుణుడు విలియం అక్ వర్త్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో ఓ కమిటీ ఏర్పడింది. సుమారు 4 ఏళ్ల సుదీర్ఘ అధ్యయనం అనంతరం సాధారణ బడ్జెట్ నుంచి దానిని వేరు చేసి, ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ప్రారంభించింది. ఇక అప్పటి నుంచి ఏకధాటిగా 92 సంవత్సరాల పాటు ఆ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది.
మొట్టమొదటిసారిగా 1994, మార్చి 24న ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఇప్పటివరకు అత్యధిక సార్లు రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘటన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ది. 2004 నుంచి 2009 ఆరేళ్లపాటు ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు.
ఇక ఆయన తర్వాత ఆ రికార్డు తృణముల్ అధినేత్రి మమతా బెనర్జీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఇన్నేళ్లలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రి ఆమె కావటం విశేషం. ఇక్కడో ఇంకో ప్రత్యేకం ఏంటంటే... యూపీఏ మరియు ఎన్టీయే రెండు ప్రభుత్వాల హయాంలో ఆమె రైల్వే మంత్రిగా పని చేయటం, బడ్జెట్ ప్రవేశపెట్టం జరిగాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more