దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో ఇద్దరు మైనర్ యువతులపై ఐదుగురు దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. రేప్ జరిగిన అనంతరం అటుగా వచ్చిన పోలీస్ వాహనాన్ని ఆపి వారు విషయం చెప్పటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ కేసులో బాధితులు తమ ప్రియుళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదుగురు దుండగులు మాపై అతి కిరాతంగా అత్యాచారం చేస్తుంటే... వారు ఓ మూలన కూర్చుని ప్రశాంతంగా ఆ దురాగతాన్ని చూస్తూ ఉండిపోయారని వారు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
కనీసం అరవాలన్న ఇంగిత జ్నానాన్ని కూడా ప్రదర్శించలేకపోయారు. పైగా ఈ దారుణంపై పోలీస్ పిర్యాదు అనంతరం సాక్ష్యం చెప్పేందుకు కూడా వారు నిరాకరించారని బాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. అమన్ విహార్ మురికివాడలో నివాసం ఉంటున్న 17, 18 సంవత్సరాల ఇద్దరు బాలికలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లారు. ఆ సమయంలో వారిని అడ్డగించిన ఐదుగురు దుండగులు ఆ ఇద్దరు స్నేహితులను బెదిరించి అమ్మాయిలపై గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు.
అనంతరం పెట్రోలింగ్ జీపు సౌండ్ రావటంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. బాధిత బాలికలను వైద్య పరీక్షకు పంపించగా వారిపై సామూహిక అత్యాచారం జరిగిందని తేలింది. అత్యాచారం చేస్తుండగా ప్రతిఘటించేందుకు చాలా ప్రయత్నించామని, పోలీసులు రాకుండా ఉంటే దుండగులు తమను చంపేసి ఉండే వారని బాధిత బాలికలు రోదిస్తూ చెప్పారు. బాధిత బాలికలు మెట్రోరైలు పనులు చేస్తున్న కూలీల కూతుళ్లని పోలీసులు చెప్పారు.
పోలీసులు రేప్ చేసిన నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. ఐదో నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి వారిని జైలుకు రిమాండుకు పంపించామని పోలీసులు వివరించారు. కాగా, ఇదే స్థలంలో ఇంతకు ముందు మూడు సంఘటనలు జరిగినా పోలీసులు మాత్రం కనీస నిఘా కూడా పెట్టలేకపోయారని స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more