గవర్నర్ పదవి మీద ఆశలు పెట్టుకుని ఎప్పటికప్పుడు ఆశాభంగం జరగటంతో నిరాశలోకి కూరుకుపోయిన మోత్కుపల్లి చిరకాల వాంఛ నెరబోరుతుందా? అంటే టీడీపీ శ్రేణులు అవుననే సమాధానమిస్తున్నాయి. ఖాళీగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ పోస్ట్ ఆయన్ను వరించబోతుందనే సంకేతాలు బలంగానే అందుతున్నాయి. ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఓ గవర్నర్ పదవి ఇస్తానని ప్రధాని మోదీ హామీ మేరకు ఆయనకు ఈ పదవి దక్కనుందట.
నిజానికి మోత్కుపల్లి ఎప్పుడో గవర్నర్ కావాల్సి ఉంది. అప్పట్లో కేంద్ర మాజీ మంత్రి నజ్మాహెప్తుల్లాతో పాటు నలుగురిని గవర్నర్లుగా నియమించినా ఈ టీటీడీపీ సీనియర్ నేతకు మాత్రం మొండి చెయ్యిచూపించారు. దీంతో తాను గవర్నర్ అవుతానని ఓపెన్ గా ప్రకటించేసిన ఆయన అవమానంగా ఫీలయ్యారు. కొద్దిరోజులకే బహిరంగంగానే అధినేత చంద్రబాబు ముందు తన అసంతృప్తిని వెల్లగక్కారు కూడా. కానీ, ఈ మధ్య తమిళనాడు, మధ్యప్రదేశ్ గవర్నర్ స్థానాలు ఖాళీలు అయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్ కోవాను సుప్రీంకోర్టు తొలగించిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో ఆయా గవర్నర్ పదవులను భర్తీ చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఈ క్రమంలోనే టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ భాద్యతలు అప్పజెప్పాలని పావులు కదులుతున్నాయంట. ఇప్పటికే ఆయన బయోడేటా కేంద్ర ప్రభుత్వం చేతికి అందిందని, ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన గవర్నర్ కావటం ఖాయమని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more