సందట్లో సడేమియా అన్నట్లు ఏపీ హోదా వ్యవహారాన్ని ఆసరగా చేసుకుని బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు కాంగ్రెస్ మంచి స్కెచ్చే వేసింది. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ప్యాకేజీ అంశంపై మాట్లాడుతూ ఆర్థిక సంఘం ఆర్థిక హోదా ఇవ్వొద్దని ఎక్కడా చెప్పలేదని పెద్ద బాంబే పేల్చారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వని పాపం 14వ ఆర్థిక సంఘానిది కాదని, అది ఎన్డీఏదేనని జైరాం రమేష్ ఆరోపించారు. కాసేపటి క్రితం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రం ప్రజలని మభ్యపెడుతోందని అన్నారు.
పోలవరం ప్రాజెక్టుని రాష్ట్రానికి అప్పగించడం సరికాదని, ఒకవేళ అప్పజెప్పితే చట్టసవరణ కూడా చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హోదా విషయంపై కేంద్ర మంత్రులు ఆర్థిక సంఘం అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని అన్నారు. జైట్లీ ఏపీకి కొత్తగా ఏమీ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు సీనియర్ మంత్రి తరహాలో మాట్లాడడం లేదని జైరాం రమేష్ అన్నారు.
హోదా ఇవ్వకపోతే ఏపీకి ఎంతో నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. ఏపీకి హోదా ఇవ్వకపోవడం వల్ల ఏటా 60 వేల కోట్ల రూపాయలు నష్టమని అన్నారు. మరో మూడేళ్లలో ఎన్నో కోట్ల నష్టం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పై విమర్శలు మానుకొని ఏపీకి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉపరాష్ట్రపతి పదవి కోసమే వెంకయ్య...
కారణాలేంటో తెలియదు కానీ వెంకయ్య అసహనంతో ఉన్నారని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి పదవి కోసమే వెంకయ్య ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇతరులను నిందించడం మానేసి హోదా కోసం చట్ట సవరణ చేయాలని ఆయన సూచించారు. చట్టంలోని అంశాలను కేంద్రం పక్కదారి పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ గందరగోళం నెలకొల్పుతోందని వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more