భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి మరో మైలు రాయి అందుకుంది. వాతావరణంలోని మార్పులను అధ్యయనం చేసేందుకు ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ-ఎఫ్05) ను విజయవంతగా నింగిలోకి ప్రవేశపెట్టింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో నిప్పులు కక్కుకుంటూ రాకెట్ జివ్వుమని దూసుకెళ్లింది. దీంతో శాస్త్రవేత్తలంతా కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగానికి బుధవారం మధ్యాహ్నం 11.10కి కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలుత గురువారం సాయంత్రం 4.10 గంటలకు లాంచింగ్ కోసం సన్నాహాలు చేశారు. అయితే ఇంధనం నింపేక్రమంలో దానికి సంబంధించిన ట్యూబులు తెరుచుకోకపోవడం వల్ల సమస్య తలెత్తడంతో 40 నిమిషాలు ఆలస్యంగా, 4.50 కి ప్రయోగం మొదలైంది.
ఇన్శాట్-3డీఆర్
భూమిపైనే కాకుండా సముద్రాల్లోనూ ఏర్పడే విపత్తులను ముందుగానే పసిగట్టి హెచ్చరించేలా వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు ఇన్శాట్-3డీఆర్ను ప్రయోగిస్తున్నట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. ఈ ఉపగ్రహంలో 6-ఛానల్ ఇమేజర్, 9-ఛానెల్ సౌండర్ అనే పరికరాలు, మెట్రోలాజికల్ డాటా రిలే ట్రాన్స్ఫాండర్స్ (డీఆర్టీ), శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రిసోర్స్ (ఎస్ఏఎస్ అండ్ ఆర్) అనే పరికరాలను అమర్చి పంపుతున్నారు.
భూమిపైన, సముద్రాలపై జరిగే మార్పులను ఛాయాచిత్రాలు తీసేందుకు 6 ఛానల్ ఇమేజర్ను ఉపయోగిస్తారు. వాతావరణ అధ్యయనానికి ప్రయోగించిన కల్పనా-1, ఇన్శాట్-3ఏ ఉపగ్రహాలు కక్ష్య నుంచి ఇప్పటికే సేవలందిస్తున్నాయి. అయితే రోజు రోజుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం పరవళ్లు తొక్కుతుండడంతో గత ఉపగ్రహాలకంటే మెరుగైన సేవలు అందించేందుకు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంగల పరికరాలను ఈ ఉపగ్రహంలో అమర్చారు. ఈ ఉపగ్రహం కూడా భూమికి 36 వేల కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్య నుంచి పనిచేస్తుంది. సముద్ర ఉపరితలంను కొలిచే సామర్థ్యం దీనికి ఉంది.
2013 జూలై 26న ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ సహకారంతో ప్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ రాకెట్ ద్వారా రోదసిలోకి ప్రవేశపెట్టిన ఇన్శాట్-3డీ ఉపగ్రహం సేవలు సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోవడంతో దాని స్థానంలో ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేశారు. ఈ ప్రయోగానికి సుమారు రూ. 250 కోట్లు వ్యయం చేసినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more