ప్రశాంత్ కిషోర్ రెగ్యులర్ గా పొలిటికల్ అప్ డేట్స్ చూసే వారికి ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రధానిగా మోదీ, బీహార్ సీఎం పీఠంపై నితీశ్ లను కూర్చోబెట్టిన ఈ రాజకీయ వ్యూహకర్త, ఇప్పుడు యూపీలో కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాడు. అయితే ఇప్పడు ఆయనపై సంచలన ఆరోపణలు చేశాడు బీహార్ బీజేపీ చీఫ్ సుశీల్ కుమార్ మోదీ. 2025 విజన్ డాక్యుమెంట్ తయారీ కోసం నితీశ్ సర్కార్ ఖజానా నుంచి 9 కోట్లు అందజేసిందని ఆరోపించాడు.
మరి అంత సొమ్ము తీసుకుని బీహార్ ను వదిలి యూపీలో పని చేయటం ఏంటని సుశీల్ ప్రశ్నిస్తున్నాడు. తక్షణమే అతన్ని ముఖ్యమంత్రి వ్యక్తిగత సలహాదారు పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చే బృహత్తర బాధ్యతలను తలకెత్తుకున్న సంగతి తెలిసిందే. 1989 తరువాత తిరిగి కాంగ్రెస్ ను అధికారంలో కూర్చోబెట్టేందుకు తన టీమ్ తో నిత్యమూ శ్రమిస్తున్నారు. అందుకే, ప్రశాంత్ బీహార్ పనిని వదిలేసి కాంగ్రెస్ పని చేస్తున్నారన్నది బీజేపీ ప్రధాన ఆరోపణ.
బీహార్ లో మహా కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు తనవంతు టెక్ సాయం చేసిన ప్రశాంత్ ను నితీశ్ కుమార్ తన సలహాదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. బీహార్ రాష్ట్రానికి 2025 విజన్ డాక్యుమెంట్ తయారీ బాధ్యతలను నితీశ్ సర్కారు ప్రశాంత్ కే అప్పగించింది. అందుకు ఆయనకు ప్రతిఫలంగా రూ. 9.31 కోట్లను కూడా బీహార్ ప్రభుత్వం ఇచ్చిందన్న వార్తలు వినిపించాయి. అయితే, నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత, ప్రశాంత్ ఆ రాష్ట్రానికి వచ్చిన సందర్భాలు కూడా పెద్దగా ఏమీ లేవు. అటువంటి అతనికి వేతనమివ్వటం ఇప్పుడు చర్చకు దారితీసింది.
కాగా, సుశీల్ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ పరువు నష్టం దావా వేయబోతున్నట్లు తెలుస్తోంది. 9 కోట్ల సొమ్ము తీసుకున్నాడన్న ఆరోపణల్లో నిజం లేదని, ఈ మేరకు త్వరలో సుశీల్ కు నోటీసులు పంపనున్నట్లు సమాచారం అందుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more