దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2న(శుక్రవారం) ట్రేడ్ యూనియన్లు, బ్యాంకులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెపై కేంద్ర ప్రభుత్వంలో కాస్త ఆందోళన నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేసి తీరతామని, వెనక్కితగ్గది లేదని యూనియన్లు ప్రకటిస్తుండటంతో స్వయానా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం కల్పించుకోనున్నారు. ఉన్నతాధికారులతో ఈ సాయంత్రం అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్న ప్రధాని, యూనియన్ నేతలకు ఎలాగైనా సర్దిచెప్పాలని అధికారులకు సూచించబోతున్నారని సమాచారం.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయుష్ గోయల్, బండారు దత్తాత్రేయ తదితర మంత్రులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా, సమ్మెను విరమింపజేసే మార్గాలను అన్వేషించాలని ప్రధాని ఇప్పటికే అధికారులకు సూచించారు. కాగా, శుక్రవారం నాటి సమ్మెలో బ్యాంకులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఫ్యాక్టరీలు మూతపడనుండగా, వీరితో కలుస్తామని రైల్వే ఎంప్లాయిస్ యూనియన్లు మాత్రం చెప్పలేదు. పలు రాష్ట్రాల యూనియన్లు మాత్రం సమ్మెకు మద్దతిస్తామని తెలిపాయి. ఏదేమైనా సామాన్యుడి జీవనం పై మరీ ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే ఈ బంద్ పై సాయంత్రం జరిగే చర్చల్లో ఏం జరగబోతుందోనని అందరిలో ఒకటే ఉత్కంఠ నెలకొంది.
గత ఏడాది సెప్టెంబర్ లో తమ నెలసరి కనీస వేతనాన్ని రూ. 9 వేల నుంచి రూ. 18 వేలకు పెంచాలన్న ప్రధాన డిమాండుతో సహా 12 డిమాండ్లతో యూనియన్లు సమ్మెకు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఫార్మా, డిఫెన్స్ రంగాల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచుతూ మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలను సైతం వెనక్కు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఈ బంద్ ను ఈసారి ఖచ్ఛితంగా చేసి తీరతామని యూనియన్లు చెబుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more