అగ్రరాజ్యలపై యుద్ధం ప్రకటించడం, అమ్మాయిల వ్యవహారంలో లైంగిక దాడుల విమర్శలు ఎదుర్కున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. కానీ, మానవత్వం మరిచి తాజాగా చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరికైనా కడుపు రగిలిపోవటం ఖాయం. కొరియన్లను ఉద్దేశించి కుక్క మాంసాన్ని కడుపారా తినండి కిమ్ చేసిన ప్రకటన విమర్శలకు తావిస్తోంది.
మూగజీవుల మారణకాండకు ఆద్యం పోసిన కిమ్ జాంగ్ ఉన్ మాటలు ఎలా ఉన్నాయంటే... 'నా ప్రియమైన ప్రజలారా! కుక్క మాంసాన్ని కడుపారా తినండి. ఎందుకంటే...బీఫ్, చికెన్, పోర్క్, బాతు మాంసాల కంటే కుక్కమాసం ఎంతో బలవర్ధకమైనది. ఎన్నో పోషక విలువలు ఉన్నాయి' అంటూ ప్రసంగించాడు. దీంతో అక్కడి వార్తా సంస్థలు మూగజీవాల్లోని పోషక విలువలు అంటూ ప్రత్యేక కథనాలను ప్రచురిస్తున్నాయి.
దేశాధ్యక్షుడే ఇలాంటి ప్రకటన చెప్పేసరికి మరి ప్రజలు ఊరుకుంటారా? మరి కర్కషంగా వాటిని చంపి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంకోదరైతే 'కుక్కలను మామూలుగా తిన్నప్పటి కంటే వాటిని బాధకు గురిచేసి చంపి తింటే ఇంకా రుచికరంగా ఉంటున్నాయంటూ లొట్టలేసుకుంటూ తింటూ ఆ ఫోటోలను, సందేశాలు నెట్ లో పెడుతున్నారు.
కొరియన్లు ఇలా రాక్షసులుగా మారిపోవటం వెనుక బలమైన వాదనే వినిపిస్తోంది. దశాబ్ద కాలంగా ఉత్తర కొరియాలో ఆకలిచావులు ఎక్కువ అయిపోయాయి. 90వ దశకం నుంచి ఇప్పటిదాకా సుమారు 3 మిలియన్ జనాభా చనిపోయినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇలా దేని పడితే దానిని తినేయటం అక్కడి జనాలు అలవాటు చేసుకున్నారు. అయితే విశ్వాసానికి ప్రతీకగా, మనిషికి చేదోడువాదోడుగా, మంచి స్నేహితుడిగా నిలిచిన కుక్కలపై జరుగుతున్న ఈ మారణకాండపై జంతు ప్రేమికులను తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more