అదనపు కట్నం కోసం భార్య, మామను నరికి చంపాడు | Husband kill wife and father in law in Krishna district

Husband kill wife and father in law for extra dowry in krishna district

Husband kill wife and father in law, additional dowry, extra dowry husband kill wife and father in law, subramanyam kill vijaya

husband kill wife and father in law for addiitional dowry in Krishna district.

భార్య, మామలను నరికి చంపాడు. ఎందుకు...?

Posted: 07/21/2016 08:53 AM IST
Husband kill wife and father in law for extra dowry in krishna district

అదనపు కట్నం అనే రోగంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తి భార్యతోసహా మామను పొట్టనబెట్టుకున్నాడు. చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో మంగళవారం అర్థరాత్రి దాటాక ఈ ఘోరం జరిగింది. 

గ్రామానికి చెందిన సబ్రహ్మణ్యం అనే వ్యక్తి భార్య విజయను అదనపు కట్నం కోసం మూడేళ్లుగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు పోలీస్ ఫిర్యాదు కూడా చేశారు. వారిద్దరినీ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం పోలీసులు వదిలేశారు. ఆ కోపంతో మృగంలా మారిన అతను గత రాత్రి కత్తిచేతబట్టి భార్య సహా మామ, అత్త, బావమరిదిపై దాడికి దిగాడు. 

భార్య విజయతో పాటు మామ వెంకటేశ్వరరావులను నరికేశాడు. రెప్పపాటులో జరిగిన ఈ దాడిలో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.ఈ దాడిని అడ్డుకోబోయిన తన బావమరిది శివరామకృష్ణ, అత్తపైనా సుబ్రహ్మణ్యం దాడి చేశాడు. శివరామకృష్ణకు తీవ్ర గాయాలు కాగా అతడి తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది.

దాడి అనంతరం సుబ్రహ్మణ్యం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో అతడిని ఆపేందుకు యత్నించిన బంధువు వెంకటేశ్వరరావుపైనా అతడు దాడికి దిగాడు. ఈ దాడిలో వెంకటేశ్వరరావుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించిన పొరుగు గ్రామం పర్వతపురం గ్రామస్తులు ఎట్టకేలకు అతడిని నిలువరించి పోలీసులకు పట్టించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : krishna district  husband  subramanyam  Vijaya  extra dowry  kill  

Other Articles