దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సునందా పుష్కర్ మృతి కేసులో పాకిస్థాన్ రచయిత్రి మెహర్ తరార్ ను ప్రశ్నించినట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. మాజీ కేంద్రమంత్రి శశిధరూర్ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని అమె తేల్చిచెప్పినట్లు తెలుసింది. శశిధరూర్ 2014 లోక్ సభ ఎన్నికల అనంతరం అమెను వివాహం చేసుకుంటాడన్న వార్తలను కూడా అమె తోసిపుచ్చారు. రెండు మూడు నెలల క్రితం భారత్ కు వచ్చిన అమెను సెంట్రల్ ఢిల్లీలోని ఓ ఐదు నక్షత్రాల హోటల్ లో మహిళా పోలీసు అధికారుల సమక్షంలోనే ఈ కేసును దర్యాప్తు అధికారి వికే యాదవ్ తరార్ ను ప్రశ్నించినట్లు సమాచారం.
2014 జనవరి 17 సునందా పుష్కర్ ఢిల్లీలోని లీలా హోటల్ సూట్ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. సరిగ్గా మెహర్ తరార్ తో ట్వట్టర్ అనుసంధానంగా జరిగిన గొడవ వెలుగుచూసిన మరుసటి రోజునే అమె మరణించడంతో ఈ కేసులో మెహర్ తరార్ వాంగ్మూలం కూడా అత్యంత అవసరమని భావించిన అధికారులు.. గత ఏడాది డిసెంబర్ లో ఈ కేసు దర్యాప్తు కోసం సహకరించాలని కోరుతూ తరార్ కు లేఖ రాశారు. కాగా, దీనిపై స్పందించిన అమె ఫిబ్రవరి చివరి వారంలో తాను దర్యాప్తుకు సహకరిస్తానని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులకు లేఖ రాశారు. గత రెండు, మూడు నెలల క్రితం అమె ఢిల్లీకి వచ్చి వాంగ్మూలం ఇచ్చారని సమాచారం.
సునంద పుష్కర్ తో ఏమైనా విభేదాలున్నాయా అనే దానిపై మెహర్ ను అధికారులు అడిగినట్టు సమాచారం. శశి థరూర్తో తనకు సాన్నిహిత్యం లేదని ఆమె వెల్లడించినట్టు తెలిసింది. ఆయనతో తనకు సంబంధం ఉందన్న ఆరోణలను ఆమె తోసిపుచ్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. సునంద్ స్నేహితురాలు నళిని సింగ్ చేసిన ఆరోపణలను కూడా మెహర్ కొట్టిపారేశారు. శశిథరూర్ లేకుండా తాను వుండలేకపోతున్నానని.. ఈ మేరకు తాను ట్విట్టర్ లో మేజేస్ లు పెట్టానని నళిని సింగ్ చేసిన అరోపణల్లో కూడా వాస్తవం లేదని తరార్ చెప్పుకోచ్చారు.
శశిథరూర్ కు తనకు మధ్య ఎలాంటి అభ్యంతరకరమైన బిబిఎం మేసేలు, ఈమెయిల్స్ పంచుకోలేదని చెప్పారు. అమెను సుమారు గంటల పాటు ప్రశ్నించి అధికారులు అమె ఇచ్చన సమాధానాలతో.. తమ దర్యాప్తులో వెల్లడైన ఇతర వివరాలను కూడా సరిపోల్చుతున్నారు. ఈ కేసులో మెహర్ తరార్ వెల్లడించిన విషయాలు చాలా కీలకమైనవిగా దర్యాప్తు అధికారులు బావిస్తున్నారు. అయితే తరార్ ను ప్రశ్నించేందుకు తమకు అధికారాలు లేవని, అందుచేత పాకిస్తాన్ హై కమీషన్ ను సంప్రదించి ఈ మేరకు అనుమతి తీసుకున్నామని కూడా అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more