ట్యూషన్కని తమ సమీప బంధువు ఇంటికి వెళ్లిన ఓ మైనర్ బాలిక(16)పై మగమృగాడు పైశాచిక పశువులా తెగబడ్డాడు. అభంశుభం తెలియని ఆ బాలిక.. తనపై జరిగిన ఘాతుకాన్ని ఎవరికీ చెప్పకుండా వుండేందుకు అమెను ప్రేమ పేరుతో వంచించాడు. గత రెండేళ్లుగా అమెపై పశువు మాదిరిగా పలుమార్లు అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లికి విషయం తెలిసి నిలదీయగా తనకేమీ పట్టీపట్టనట్లు ఉండిపోయాడు. ఈ దారుణంపై పోలీసులను అశ్రయించేందుకు సిద్దమైన బాధిత కుటుంబాన్ని బంధువులు నిలువరించారని సమాచారం. కులపెద్దలు రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా పరిష్కరించేందుకు యత్నిస్తున్నారు. ప్రమే వ్యవహారంతో పాటు తనను చంపి, తాను చనిపోతానని బెదిరింపులు, హెచ్చరికలు చేసిన మృగాడి మాటలను విశ్వసించిన బాలిక బతుకు అంధకారమయమైంది. అటు కళాశాలకు వెళ్లలేక భవిష్యత్తు ఏంటో అర్థంకాక కుమిలిపోతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తి మండలానికి చెందిన బాలిక గత ఏడాది 10వ తరగతి పూర్తిచేసింది. ప్రస్తుతం పశ్చిమ మండలాల్లోని ఓ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. పదో తరగతి చదివేటప్పుడు తమ సమీప బంధువు వద్దకు ట్యూషన్కు వెళ్లేది. ఆ సమయంలో అతడు లైంగిక వేధింపులకు దిగడంతో ట్యూషన్ మానేసింది. కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే.. లైంగిక వేధింపుల విషయం వారికి చెప్పలేకపోయింది. మళ్లీ అతడి వద్దకే ట్యూషన్కు పంపడంతో ఈసారి ప్రేమిస్తున్నానని నమ్మించి, అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ‘నిన్ను చంపి నేనూ చచ్చిపోతా’ అని బెదిరించాడు. భయపడ్డ ఆ బాలిక ఈ విషయం ఎవరికీ చెప్పక పోవడంతో మరింత రెచ్చిపోయాడు.
పదో తరగతి పూర్తయ్యాక గురుకుల పాఠశాలలో ఆమె ఇంటర్ చేరింది. అయినా వదలని ఆ మృగాడు ఈనెల 13వ తేదీన కళాశాలకు వద్దకు వెళ్లాడు. తాను సమీప బంధువునని.. బాలికకు అనారోగ్యంగా ఉందని ఇంటికి తీసుకెళ్లాలని అక్కడి అధికారులను నమ్మించాడు. వారు కూడా అతడి వెంట పంపారు. రాత్రికి ఆ బాలికను రేణిగుంటలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత తాను క్షేమంగా ఇంటికి చేరినట్లు కళాశాల వారికి ఫోన్ చేయించాడు. మరుసటి రోజు ఆ బాలికను శ్రీకాళహస్తికి తీసుకొచ్చాడు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమీపంలోని తమ బంధువుల ఇంట్లో బంధించి, అత్యాచారం చేశాడు.
మరోవైపు బాలిక కోసం ఆమె తల్లి కళాశాలకు ఫోన చేయడంతో.. సమీప బంధువు తీసుకెళ్లిన విషయాన్ని అధికారులు చెప్పారు. ఆ బాలిక తల్లి వెంటనే అతడి కుటుంబీకులను నిలదీశారు. వారు రెండ్రోజుల కిందట బాలికలను ఇంటికి పంపేశారు. తమ బిడ్డ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే.. పట్టీపట్టనట్లు ఉండిపోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కొందరు పెద్దలు అడ్డుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కళాశాలకు వెళ్లలేక.. ఇంటి నుంచి బయటకు రాలేక ఆ బాలిక ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో మానసిక ఒత్తిడిలో బాలిక ఏలాంటి తీవ్ర పరిణామాలకు గురైయ్యే చర్యలకు పాల్పడుతుందోనని బాధిత కుటుంబసభ్యులు భయాందోళన చెందుతున్నారు. బాధిత కుటుంబ బందువులు మాత్రం ఆ దుర్మార్గుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more