ఫ్రాన్స్ దేశంపై ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. గత ఏడాది నవంబరులో ప్యారిస్ నగరంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డి 130 మంది ప్రాణాలను బలిగోన్నారు. ఈ ఘటనను ఇప్పుడిప్పుడే మర్చిపోయి తమ దేశ జాతీయ దినోత్సవం సంబరాలను జరుపుకుంటున్న ప్రాన్స్ దేశ పౌరులపై ముష్కరమూకలు మరోమారు తెగబడ్డాయి. నైస్ నగరంలో నిర్వహిస్తున్న వేడుకల సంబరాల్లో మునిగితేలుతున్న పౌరులపైకి.. మందుగుండు సామాగ్రితో భారీ ట్రక్కు జనంపైకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో 75మంది దుర్మరణం చెందారు. మరో 50మంది పరిస్థితి విషమంగా ఉంది. 100మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో జాతీయ దినోత్సవ సంబరాల్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది.
ఉత్సవాల్లో భాగంగా బాణాసంచా వెలుగులను వీక్షిస్తున్న జనాలపైకి ఉగ్రవాదులు అతివేగంతో ట్రక్కును నడిపారు. దీంతో పోలీసులకు ట్రక్కు డ్రైవర్ కు మధ్య కాల్పులు జరిగాయి. ట్రక్కు డ్రైవర్ ను మట్టుబెట్టిన పోలీసులు.. ఘటనాస్థలం నుంచి తప్పించుకొని రెస్టారెంట్లో నక్కిన మరో ఉగ్రవాదిని కూడా భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఫ్రాన్స్ సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ట్రక్కు దూసుకుపోయిన ప్రాంతంలో కుప్పలుగా మృతదేహాలు పడి ఉన్నాయి. క్షతగాత్రులకు వైద్యసేవలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటన చేటుచేసుకున్న నేపథ్యంలో నగరంలో ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని నైస్ నగర మేయరు క్రిస్టియన్ ఈస్ట్రోసి కోరారు. గత ఏడాది నవంబరులో ప్యారిస్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 130 మంది మరణించారు. ఫ్రాన్స్ లో జరిగిన దాడిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. ఈ దాడిలో అమాయక జనం మరణించారని వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఫ్రాన్స్ లో ఉన్న బ్రిటీష్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశం కోరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more