శీర్షిక చూసి కాంగ్రెస్ పార్టీ నుంచి అమెకు బంఫర్ ఆఫర్ వచ్చిందనుకుంటున్నారు కదూ, కానీ కాదు. అయితే అమెకు దక్కింది మాత్రం బంఫర్ ఆఫరే. అది కూడా అమెకున్న కష్టాలన్నీ తీరిపోయే బంఫర్ ప్రైజ్ మనీ అఫర్. అదేంటి అంటారా..? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి రూపాయల బంఫర్ అఫర్. కేరళలోని రబ్బరు తోటల్లో పనిచేసే ఓ మహిళకు ఏకంగా కోటి రూపాయల లాటరీ తగిలడం.. అమె కష్టాలన్నీ ఒక్కసారిగా దూరం కావడం అంటే బంఫర్ అఫరే కదండీ.
వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురం జిల్లాలోని కిలిమనూరుకు చెందిన నబీసాకు మొదటి బహుమతిగా కోటి రూపాయలను గెలుచుకుంది. దీంతో నబీసా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. జబ్బుతో బాధపడుతున్న తల్లి, ఓ ప్రమాదంలో కాలు కోల్పోయిన చెల్లిని పోషించాల్సిన బాధ్యతను నెత్తిపై వేసుకున్న నబీసాకు ఈ లాటరీతో ఊపిరి వచ్చినట్టయింది. గతంలోనూ చాలాసార్లు లాటరీ టికెట్లు కొన్న ఆమె మూడుసార్లు రూ.5వేల బహుమతిని, చాలాసార్లు వెయ్యి రూపాయల బహుమతి గెలుచుకుంది. లాటరీలో తగిలిన కోటి రూపాయల్లో కొంత ఖర్చు చేసి ఓ ఇల్లు కొనుక్కుంటానని నబీసా పేర్కొంది. దివ్యాంగురాలైన తన సోదరితో స్టేషనరీ షాపు పెట్టిస్తానని చెప్పుకొచ్చింది.
అయితే దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధమేంటి అంటున్నారు కదూ..? అక్కడికే వస్తున్నాం. కేరళ రాష్ట్రంలోని నిరుపేద మహిళల సహాయార్థం.. కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూడీఎఫ్ ప్రభుత్వం ఈ స్త్రీశక్తి లాటరీని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మొదట్లో ఈ లాటరీని ప్రవేశపెట్టినా.. ప్రతి వారం రోజులకు ఒకమారు డ్రా వెలువడుతుండటంతో అప్పుడూ 11వ డ్రా వచ్చేసింది. నబీసా రాష్ట్ర ప్రభుత్వ 11వ స్త్రీ శక్తి లాటరీ గెలుచుకుంది, వీక్లీ లాటరీ అయిన దీని టికెట్ ధరను ఇటీవల రూ.40 నుంచి రూ.50కి పెంచారు. లాటరీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం మహిళా సంరక్షణ, పునరావాసం తదితర వాటికోసం ఖర్చు చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more