ఇండియాను షేక్ చేసిన ఓ పెద్ద గ్యాంగ్ స్టర్. కానీ పాపాలు పండి చేసిన నేరాలకు చివరకు పోలీసులకు చిక్కిపోయాడు. అయితేనేం, ఆయనగారిది నేరం చేయకముందు ఎలాంటి జీవితాన్ని ఎంజాయ్ చేశాడో, చిక్కాక కూడా దాదాపు అదే రేంజ్ లో చేస్తున్నాడు. ఎవరో కాదు... అబూ సలేం. ఇది పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు... ప్రస్తుతం ఎక్కడున్నాడు? అదేం ప్రశ్న! అరెస్టయి ముంబై తలోజా జైల్లో రెస్ట్ తీసుకుంటున్నాడనేగా మీ సమాధానం. కానీ, ఓ సారి ఆయన లైఫ్ ఎలా ఉందో చూడండి.
విచారణల కోసం తరచూ లక్నో, ఢిల్లీ కి వెళ్లేటప్పుడు మధ్యలో రైల్వేస్టేషన్లలోని వెయిటింగ్ రూంల్లో తన భార్యతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను ముంబై కి చెందిన ఓ ప్రముఖ పత్రిక ప్రచురించడంతో కలకలం రేగింది. అబూసలేంను తాను ప్రేమించుకున్నామని, తమ పెళ్లికి అనుమతి ఇవ్వాలని ముంబైకి చెందిన కౌసర్ అనే 26 ఏళ్ల యువతి అప్పట్లో కోర్టును కోరింది. అయితే అభ్యర్థన అలాగే ఉండగా, ఎస్కార్ట్ పోలీసుల సమక్షంలో రైలులో వీరి పెళ్లి అయిపోయిన్లు కథనాలు వెలువడ్డాయి. 2014 లో దీనిపై విచారణ జరుగగా, పోలీసులు మాత్రం అదంతా ఉత్తదేనని ఖండిస్తూ కేసును మూసివేశారు.
కానీ, ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన ఫోటోలు చూస్తే అది నిజమే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. రైలు బోగీల్లో, వెయిటింగ్ హాళ్లలో కౌసర్ తో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వారి పెళ్లిని ధృవీకరిస్తున్నాయి. అబూసలేం కౌసర్ తోపాటు మరికొందరు కుటుంబ సభ్యులను కూడా కలుస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్న ఫోటోలను కూడా పత్రిక విడుదల చేసింది. పోలీసులు ఈ ఫోటోలు పాతవని, ఆ కథనాలన్నీ పచ్చి అబద్ధాలని పోలీసులు చెబుతున్నారు. అన్నట్లు గతంలో తలోజా జైల్లో ఈ మాజీ డాన్ కు సకల రాజభోగాలు కల్పిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పడు ఇలా... ఏదేమైనా ఆయనగారి లైఫ్ అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ కేకే అంటు సెటైర్లు పేలుస్తున్నారు కొందరు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more