టీఆర్ఎస్ పార్టీ అవిర్భవించిన నాటి నుంచి ఏడాది క్రితం ఓటుకు నోటు కేసు వెలుగుచూసే వరకు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలకు నచ్చని ఓకే ఒక పదం జై ఆంధ్ర. ప్రాంతీయ విద్వేషాలు తారాస్థాయికి చెందిన సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి కౌంటర్ గా సాగిన జై అంధ్ర ఉద్యమాన్ని అప్పట్లో తెలంగాణ నేతలు జీర్ణించుకోలేదు. ఆంద్ర అన్న పదాన్నే నిషేధిత పదంలా చూశారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మాత్రం తెలంగాణ నేతల తెలుగు ఐక్యతకు నడుంబిగించుకున్నట్లుగా కనబడుతున్నారు.
ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటనలో పక్క రాష్ట్రాలవారితో ఊరికే లోల్లి పెట్టుకోవడం ఎందుకంటూ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత ఇటీవల కేటీఆర్ చంద్రబాబుకు సన్నాయి నోక్కుల ట్విట్ చేయడం కూడా అసక్తి కరంగా మారింది. తాజాగా కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం చర్చనీయాంశంగా మారింది. అదేంటి అంటారా.. అగ్రరాజ్యం అమెరికాలోని చికాగోలో తానా నిర్వహించిన తెలుగు మహాసభల రజతోత్సవ వేడుకలకు హాజరైన కవిత కూడా అలాంటి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఒక్కటేనన్నారు. ఏ దేశంలోనైనా ఏదైనా ప్రమాదం జరిగితే తెలుగువారు ఎలా ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తారని కవిత చెప్పారు. గతంలో అమెరికా అంటేనే తానా మహాసభలు, ఆటా మహాసభలు గుర్తుకు వచ్చేవని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు ఆచార సంప్రదాయాలను కాపాడటం కోసం ఆటా చేస్తున్న కృషి సహకరించిన ప్రతినిధులను అభినందించారు. కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాలు విడిపోయాయని అన్నారు. జై తెలంగాణ.. జై ఆంధ్ర... జై హింద్ తన ప్రసంగాన్ని ముగించి అందరనీ ఆశ్చర్యంలో ముంచారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more