ఓవైపు ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న తెలంగాణకు అప్పులు కూడా అదే స్థాయిలో ఉన్నాయన్నది ప్ర్యతేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భోళా శంకరుడిని మించే స్థాయిలో వరాలు ఇచ్చుకుంటున్న సీఎం కేసీఆర్ ఆదాయం రాబట్టంలో మాత్రం వెనుకబడే ఉన్నారన్నది ఒప్పుకోవాల్సిన నిజం. తెలంగాణ ప్రభుత్వం ఆలసత్వాన్ని అలుసుగా తీసుకుని తాజాగా 1500 కోట్ల రూపాయలుకు పంగనామం పెట్టారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలువురు బిల్డర్లు హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్లు ప్రారంభించారు. వాణిజ్య, నివాస ప్రాజెక్టులపై 5 శాతం షేర్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, వ్యాట్ తదితర రూపాల్లో బిల్డర్లు ప్రభుత్వానికి రెవెన్యూ చెల్లించాల్సి ఉంది. అలాగే ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణం రూపంలో ఏపీహెచ్బీకి సొమ్ము చెల్లించాల్సి ఉంది. అయితే సంవత్సరాల తరబడి ఈ విషయం పెండింగ్లో ఉంది. అయితే ఆ తర్వాత బిల్డర్లు ఆ విషయాన్ని గాలికొదిలేసి చెల్లించాల్సిన మొత్తాన్ని ఎగవేశారు.
కేవలం 9 మంది బిల్డర్లే ప్రభుత్వానికి దాదాపు 600 కోట్ల వరకు చెల్లించాల్సింది వుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో కళ్లు తెరిచిన తెలంగాణ ప్రభుత్వం బిల్డర్ల నుంచి బకాయి సొమ్మును ఎలా రాబట్టాలన్న విషయంపై ఓ కేబినెట్ సబ్ కమిటీ వేసింది. కమిటీ సూచనల ప్రకారం బకాయి సొమ్మును రాబట్టనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more