ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో వరుస ఒటముల తరువాత పడి లేచిన కెరటంలా.. దూసుకెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనాలు మించి రాణించి.. ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. మరో రెండు మ్యాచులు అడేందుకు మిగిలివుండగానే ఈ సీజన్ లో తొలిసారిగా బర్త్ ఖాయం చేసుకుంది. కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్ బెర్తును దక్కించుకుంది. ఈ తాజా విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్కు చేరింది.
కింగ్స్ పంజాబ్ విసిరిన 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సన్ రైజర్స్ కు శుభారంభం లభించింది. సన్ రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(52;41 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్స్), శిఖర్ ధవన్ (25;22 బంతుల్లో 4 ఫోర్లు) చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం దీపక్ హూడా(34; 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోవడంతో సన్ రైజర్స్ 16.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఆపై యువరాజ్ సింగ్(42 నాటౌట్;24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పాటు, కట్టింగ్(21నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు,
దీంతో సన్ రైజర్స్ ఇంకా రెండు బంతులుండగానే విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ మురళీ విజయ్(6) నిరాశపరచగా, హషీమ్ ఆమ్లా(96;56 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అనంతరం సాహా(27), గుర్ కీరత్ సింగ్(27), డేవిడ్ మిల్లర్(20 నాటౌట్)లు ఫర్వాలేదనిపించారు. హషీమ్ అమ్లా చేసిన భారీ స్కోరు కూడా పంజాబ్ ను అదుకోలేకపోయింది. దీంతో ప్లేఆప్ లోకి ఎంటరవ్వని జట్టుగా పంజాబ్ నిలిచింది
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more