కాంగ్రెస్ అధ్యక్షుడి మీద రోశయ్య పరువునష్టం దావా | Roshaiah filed a Lawsuit against congress president

Roshaiah filed a lawsuit against congress president

Tamilnadu, congress, Roshaiah, Tamilnadu Governor Roshaiah, తమిళనాడు, రోశయ్య, కాంగ్రెస్

Tamilnadu Governor Roshaiah filed a lawsuit against congress president in Tamilnadu.

కాంగ్రెస్ అధ్యక్షుడి మీద రోశయ్య పరువునష్టం దావా

Posted: 05/12/2016 10:16 AM IST
Roshaiah filed a lawsuit against congress president

కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎంతో అండగా నిలిచిన వృద్దనేత రోశయ్య ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా పని చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సెగ తారాస్థాయిలో ఉన్నప్పుడు నాడు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటి పరిస్థితులను తట్టుకోలేనని.. రోశయ్య సోనియాగాంధీతో విన్నవించుకుంటే ఆమె ఆయన స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారు. కాగా ముందు నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా చాలా అనుయాయుడిగా రోశయ్యకు గుర్తింపు ఉంది. అయితే తాజాగా తమిళనాడు గవర్నర్ హోదాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీద పరువు నష్టం దావా వెయ్యడం సంచలనం రేపింది.

మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, త‌మిళ‌నాడు గ‌వ‌ర్నర్ రోశ‌య్య కాంగ్రెస్ పార్టీ మీద కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశారు. త‌మిళ‌నాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలంగోవ‌న్ మీద ఆయ‌న ఈ దావా వేయ‌డం గ‌మ‌నార్హం. గ‌త నెల 31న ఓ టీవీఛానల్ ఇంట‌ర్వూలో ఇలంగోవ‌న్ రోశ‌య్య మీద ఆరోప‌ణ‌లు చేశాడు. తమిళనాడులోని విశ్వ విద్యాలయాలలో వైస్ చాన్స్ లర్ ల నియామకంలో అవకతవకలు జరిగాయని ఒక్కో వైస్ చాన్సలర్ పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వగా, అందులో పది కోట్లు జయలలితకు ఇచ్చి, ఐదు కోట్లు గవర్నర్ తన వద్దే ఉంచుకున్నారని ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో కోర్టులో పిటీష‌న్ వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles