కేరళలోని పుట్టింగల్ ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 112కు చేరింది. బాణాసంచా పేలుడు సమయంలో అగ్నికీలలు బాణాసంచాపైకి ఎగసిపడటంతో అదివారం తెల్లవారుజామున ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది, క్రితం రోజు రాత్రి పొద్దుపోయే సమయానికి 106 మంది ఈ ఘటనలో అసువులు బాయగా, ఇవాళ తెల్లవారేసరికి ఆ సంఖ్య 112కు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ 300 మందికి పైగా క్షతగాత్రుల్లో ఇంకా చాలా మంది పరిస్థితి విషమంగానే ఉంది.
క్షతగాత్రులను తొలుత కొల్లం పరిధిలోని ఆసుపత్రులకు తరలించిన సహాయక సిబ్బంది... పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఎయిర్ అంబులెన్స్ ల ద్వారా తిరువనంతపురానికి తరలించారు. ఇదిలా ఉంటే, ఈ ప్రమాదాన్ని సీరియస్ గా పరిగణించిన కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. పుట్టంగల్ ఆలయంలో మారణహోమానికి కారణమైనవారిలో ఐదుగురిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. బాణసంచా పేలుడుతో సంబంధమున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు కేరళ డీజీపీ తెలిపారు.
మరోవైపు పుట్టంగల్ ఆలయంలో పేలుడు సంభవించిన ఘటనా స్థలాన్ని పోలీసు అధికారుల బృందం ఈ ఉదయం పరిశీలించింది. భారీ పేలుడుకు దారితీసిన కారణాలను అన్వేషించింది. ఈ విషాదఘటన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిన్న మధ్యాహ్నం వైద్యుల బృందాలను వెంటబెట్టుకుని ఘటనాస్థలానికి వచ్చి, క్షతగాత్రులను పరామర్శించారు, అయితే ఇవాళ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించనున్నారు.
ఇదిలావుండగా, కేరళలోని దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతున్న వేళ, బాణసంచా కాల్చడం సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైపోయిందని, బాణసంచాను నిషేధించలేమని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. నిన్న కొల్లంలోని పుట్టింగళ్ దేవి ఆలయంలో భారీ ఎత్తున బాణసంచా అంటుకుని 112 మంది మరణించిన ఘోర దుర్ఘటన అనంతరం, బోర్డు అధ్యక్షుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు ఇప్పటివరకూ ఐదుగురిని అరెస్ట్ చేశారు.
దుర్ఘటన వెనుక పోలీసుల వైఫల్యం లేదని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితల తెలియజేశారు. పోలీసులు బాణసంచా ప్రదర్శనను ఎందుకు ఆపలేదని ప్రశ్నించగా, 'లక్షలాది మంది గుమికూడి ఉన్న ప్రాంతంలో, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పోలీసులు చర్యలు తీసుకుంటే, మరో సమస్య ఉత్పన్నమవుతుంది. అన్ని విధాలుగా పరిస్థితిని పరిశీలించాల్సి వుంటుంది కదా?' అని అన్నారు. కాగా, నేడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొల్లాంను సందర్శించనున్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more