సాహపమే చైరా డింబకా.. అన్నది కదరా పాతాళభభైరవి అన్న నాగార్జున చంద్రలేఖ చిత్రంలోని పాటనే ప్రేరణగా తీసుకున్నాడో.. లేక దైర్యే సాహసే లక్ష్మీ అన్న నానుడిని వంటపట్టించుకున్నాడో కాని ఓ పాతబస్తీ యువకుడు రియాల్టీ షోలో తన సత్తాను చాటాలనుకుని.. అందరి చేత ఔరా అనిపించుకోవాలనుకున్నాడు, సాహసం చేస్తేనే తనకు పేరుతో పాటు ధనం కూడా వస్తుందని భావించి చేసిన సాహసమే అతని ప్రాణాలను బలిగోంది. ఇక టీవీ షోలను అనుకరిస్తూ చేసిన స్టంట్ 19 ఏళ్ల బాలుడిని బలి తీసుకుంది.
వివరాల్లోకెళితే... టీవీ రియాలిటీ షోలను చూసిన జలాలుద్దీన్ అనే 19 ఏళ్ల బాలుడు ఈ నెల 7న ఫైర్ స్టంట్ చేశాడు. ఫలక్ నుమాలోని ఇరుకైన జనవాసాల మధ్య అతను చేస్తున్న ఈ సాహసాలను అక్కడి ప్రజలు అభ్యంతరం తెలిపారు. ఇలాంటి స్టంట్లు ఏమైనా వుంటూ నిర్జన ప్రాంతంలోకి వెళ్లి చేసుకోవాలని సూచించారు, అయితే తాను సాహసం చేయాలని నిర్ణయించుకున్న జలాలుద్దిన్.. స్నేహితులతో కలసి స్థానికంగా వున్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి అక్కడ ప్రాక్టీసు చేయడం ప్రారంభించాడు.
స్నేహితుల సమక్షంలోనే అతడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని స్వయంగా తన శరీరానికి నిప్పు పెట్టుకున్నాడు. ఆ సందర్భంగా అతడి మిత్రులు వారిస్తున్నా అతడు వినలేదు. ఈ స్టంట్ లో జలాలుద్దీన్ యత్నం బెడిసికొట్టింది. శరీరానికి స్వహస్తాలతో పెట్టుకున్న నిప్పు కారణంగా అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడు ఆసుపత్రి బెడ్ పైకి చేరాడు. ఈ క్రమంలో వైద్యులు అందించిన చికిత్స పెద్దగా ఫలితాన్నివ్వలేకపోయింది. చికిత్స పొందుతూనే అతడు చనిపోయాడు. దీంతో పాతబస్తీలో విషాద ఛాయలు అలముకున్నాయి. జలాలుద్దీన్ చనిపోయిన నేపథ్యంలో అతడి ఫైర్ స్టంట్ కు చెందిన వీడియో మీడియా చేతికి చిక్కింది. ప్రస్తుతం ఈ వీడియో అటు తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రముఖంగా ప్రసారమవుతుండగా, ఇటు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తుంది,
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more