అనుకున్నంతా అయ్యింది. టీమిండియా అబిమానులు దేని గురించైతే భయపడ్డారో అదే జరిగింది. టి20 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా నిలిచిన టీమిండియా సెమిస్ లో వెస్టిండీస్ చేతులో ఓడిపోయింది. వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు చివరి వరకు పోరాడి టీంను గెలిపించుకున్నారు. ఇక బౌలర్ల కొరత కొట్టొచ్చినట్టు కనిపించే టీమిండియా ఈ సారి కూడా అదే బలహీనతతో ఓడిపోయింది. చివర్లో జడేజా, కోహ్లీ వేసిన ఓవర్లలో వెస్టిండీస్ బ్యాట్స్ మ్యాన్ లు రెచ్చపోయి ఆడారు. వాంఖడే స్టేడియంలో పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది. టీమిండియా గెలుస్తుందా లేదా అన్న నరాలు తెగే ఉత్కంఠత మధ్య టీమిండియా ఓటమిపాలైంది.
టాస్ ఓడిపోయిన టీమిండియా బ్యాటింగ్ చాలా కాన్ఫిడెంట్ గా ప్రారంభించింది. రోహిత్ చెలరేగిపోయాడు. డేంజరెస్ బౌలర్ రస్సుల్ ని చితకబాదాడు. ఇక రెహానే క్లాస్ ఇన్నింగ్స్ తో స్పిన్ బ్యాక్ ఫుట్ మీద ఎలా ఆడాలో అందరికీ చూపించాడు. రోహిత్ అవుట్ అయ్యాక వచ్చిన కోహ్లీ బ్రావో బౌలింగ్ లో ఒకే బాల్ రెండుసార్లు రనౌట్ ని తప్పించుకున్నాడు. తర్వాత మెల్లగా క్రీజులో పాతుకుపోయాడు. రెహానే ఔటయ్యాక టాప్ ఆర్డర్ లో వచ్చిన ధోనితో కలిసి చెలరేగిపోయాడు. ధోని కూడ ఎక్కువగా కోహ్లీకే స్ట్రయికింగ్ వచ్చేలా చేశాడు. దీంతో విరాట్ కేవలం 47 బంతుల్లో 89 పరుగులు చేసి భారీ టార్గెట్ ని భారీ హిట్టర్ల ముందు నిలిపాడు.
ఇక భారీ టార్గెట్ ని ఛేదించేందుకు వచ్చిన వెస్టిండీస్ ఆరంభంనుంచీ ఆచితూచి ఆడింది. ఫస్ట్ ఓవర్ గేల్ వికెట్ కాపాడుకునేందుకే ఎక్కువగా ప్రయత్నించాడు. రెండో ఓవర్ బుమ్రా బౌలింగ్ కి దిగగానే ఒక అద్భుతమైన యార్కర్ లెంగ్త్ బాల్ తో క్రిస్ గౌల్ ని క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్ పై భారత్ పట్టు బిగించింది. తర్వాత టోర్నమెంట్ లో డేంజరెస్ బ్యాట్స్ మెన్ అయిన సామ్యూల్స్ ని నెహ్రా ఒక తెలివైన స్లో బాల్ తో బోల్తా కొట్టించాడు. చార్లెస్, సిమన్స్ తర్వాత చెలరేగిపోయారు.వాళ్లు షాట్స్ కొడుతుంటే స్టేడియం డల్ అయిపోయింది. అందరికీ ఒకటే ఉత్కంఠ. ఇక మ్యాచ్ పోయిందనుకున్నారు. రెండు సార్లు ఇండియన్స్ నోబాల్స్ వేస్తే సిమన్స్ రెండుసార్లు ఔటై మళ్లీ వచ్చాడు. ఇలా టీమిండియా చేసిన కొన్ని తప్పులు వెస్టిండీస్ ను విజయతీరాల వైపుకు నడిపించాయి.
వెస్టిండీస్ స్కోరు వివరాలు: చార్లెస్-52,క్రిస్ గేల్-5, సామ్యూల్ 8, సిమన్స్ 83 (నాటౌట్), రస్సెల్స్-43(నాటౌట్)
భారత్ స్కోరు వివరాలు: రహానే-40(35 బంతులు), రోహిత్ శర్మ-43 (31బంతులు), ధోనీ-15(9బంతులు) నాటౌట్, విరాట్ కోహ్లీ-89 (47 బంతులు)నాటౌట్ గా నిలిచారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more