అవును.. మీరు చదువుతన్నది అక్షరాల నిజం. ఆత్మ దొంగతనాలు చేస్తోంది.. అది కూడా బంగారం, డబ్బులు కొట్టేసి మరీ తప్పించుకుంటోంది. మాదాపూర్ లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దొంగతనం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. దొంగతనం చెయ్యడం అంటే మామూలుగా కాదు.. ఎంతో ప్రొఫెషనల్ గా కుక్కలకు మత్తు మందు ఇచ్చి.. డోర్ పక్కన ఉన్న కిటికీకి గ్రిల్ ద్వారా కన్నం కొట్టి లోపలున్న బంగారం, డబ్బులతో ఉడాయించింది ఆత్మ. అయితే దీని మీద విచారణకు దిగిన పోలీసులు... ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. ఫింగర్ ప్రింట్స్ ను పాత రికార్డులతో పోల్చగా.. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అయ్యాయి. అందుకే అందరూ ఆత్మ దొంగతనం చేసిందని ఫిక్సయ్యారు.
దొంగతనం జరిగిన ప్రదేశంలో ఫింగర్ ప్రింట్స్ ను కలెక్ట్ చేసిన పోలీసులు పాత రికార్డులను పరిశీలించారు. అలా చూస్తుండగా.. 1998లో నమోదైన దొంగతనం కేసులకు సంబంధించిన వేలిముద్రలతో పోల్చి చూశారు. అప్పుడు మాదాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఓ దోపిడీ కేసులోని ప్రధాన నిందితుడు సంతోష్కుమార్ షిండే వేలి ముద్రలతో సరిపోయాయి. అప్పటి నుంచి అల్వాల్ క్రైం పోలీసులు సంతోష్కుమార్ షిండేను పట్టుకోవడం కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో 2007లో సంతోష్కుమార్ షిండే మృతి చెందినట్టు షోలాపూర్ మున్సిపల్శాఖ ఇచ్చిన డెత్ సర్టిఫికేట్ను అతని కుటుంబసభ్యులు మాదాపూర్ పోలీసులకు సమర్పించినట్టు గుర్తించిన అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన అల్వాల్ క్రైం పోలీసులకు అల్వాల్లోనే కాకుండా నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలల్లో ఇలాంటి ఫింగర్ ప్రింట్స్ దొరికినట్లు తెలుసుకున్నారు. ఆ జిల్లాల పోలీసులు సంతోష్కుమార్ షిండే కోసం గాలిస్తుండగా సైబరాబాద్ పోలీసులు మాత్రం అతని డెత్సర్టిఫికెట్ ఉన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. దాంతో పోలీసులకు చమటలు పడుతున్నాయి. డెత్ సర్టిఫికేట్ అబద్దమా లేదంటే ఫింగర్ ప్రింట్ రిపోర్ట్ తప్పా..? అని పోలీసులు తలలు పట్టుకుంటున్నారట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more