సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ వద్ద ఈ ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా ఆ ఇంజనీరు మీద కత్తులతో దాడి చేయగా... అతడు అక్కడికక్కడే రక్తపు మడుగులో ఒరిగాడు. .యువకుడిని దారుణంగా చంపారన్న వార్త సికింద్రాబాద్ లో సంచలనం సృష్టించింది. దాంతో స్థానికులు వెంటనే మహంకాళి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సంజయ్ జంగ్ ఉదయం సికింద్రాబాద్ లోని స్వప్న లోక్ కాంపెక్స్ వద్ద నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో తెలుగు రంగుతో ఉన్న ఓ స్విఫ్ట్ కారు వచ్చింది. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు సంజయ్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీనిని గమనించిన సంజయ్ పరుగులు తీశాడు. కానీ వారు సంజయ్ ను పట్టుకుని కత్తులతో ఇష్టమొచ్చినట్లుగా పొడిచారు. దీనితో అతను అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు. వెంటనే నిందితులు అదే కారులో ట్యాంక్ బండ్ వైపుగా పారిపోయారు. సంజయ్ వద్ద లభించిన ఐడీ కార్డు, సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సంజయ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కాంప్లెక్సు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎవ్వరితోనూ శత్రుత్వం లేదని కుటుంబసభ్యులు పేర్కొంటున్నట్లు సమాచారం. నిందితులను పట్టుకున్న తరువాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సంజయ్ ను ఎందుకు హత్య చేశారో తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more