తనకు రాజకీయ భవిష్యత్ కల్పించిన మాతృపార్టీ తెలుగుదేశం గూటికి చేరి చేరగానే భూమా నాగిరెడ్డి తన మార్కు రాజకీయాలకు తెరలేపారు. కర్నూలు జిల్లాలో ఒకే పార్టీలో చేరిన రాజకీయ ప్రత్యర్థుల మధ్య రాజకీయవాతావరణం వేడెక్కింది. జిల్లాలో ప్రధాన తెలుగుదేశం నేతలైన శిల్పా సోదరులకు ఇష్టం లేకున్నా, భూమా కుటుంబాన్ని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించడంతో ఇక వారినే టార్గెట్ చేసుకున్న భూమానాగిరెడ్డి వారిపఃప తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించారు.
సొంత పార్టీలో తనకున్న మిత్రులను దాదాపు పదేళ్ల తరువాత కలుసుకున్నారు. వారిలో ఒకరే మాజీ మంత్రి ఫరూక్. ఈ నేపథ్యంలో ఫరూక్.. శిల్పా సోదరులే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. వారు ఓడిపోయిన నేతలని గుర్తు చేశారు. ఓడిన వారు సిగ్గుపడాలని, బయటకు కూడా రావద్దని ఫరూక్ హెచ్చరించారు. వరద పనులకు కేటాయించిన నిధులను సోదరులిద్దరూ మెక్కేశారని ఆరోపించారు. రోడ్ల విస్తరణ గురించి, ప్రజల ఇబ్బందుల గురించి, నంద్యాలకు వరదముప్పు గురించి వాళ్లు ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు.
అయితే ప్రత్యర్థి పార్టీల నేతలు అరోఫణలు చేస్తే వాటి సత్యదూర అరోపణలను కోట్టేసే నేతలు.. పార్టీ అధిష్టానం.. మరి సొంత పార్టీ నేతలు వారిపై అరోపణలు గుప్పిస్తున్న తరుణంలో వారిపై పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటరా..? లేక తమ గూటికి చెందిన పక్షులే అని వదిలేస్తారా..? అని పలువురు రాజకీయ విశ్లేషకులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆయన చర్యలు తీసుకున్న పక్షంలో అవి ఎలా వుంటాయన్నది ఉత్కంఠను రేపుతుంది. ఉభయకుశోలపరి అన్నట్లుగానా.? లేక కొత్త వింత పాత రోత అన్నట్లుగా వుంటాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more