రాష్ట్ర విభజన జరిగి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు తెలుగు చంద్రులు అధికార పగ్గాలు కూడా చేపట్టకముందు.. హుటాహుటిన జరిగిన పరిణామాలలో భాగంగా ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాలను ఏపీలో కలిపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ఏర్పాటైన కేంద్ర క్యాబినెట్ ఈ అంశానికి అత్యంత ప్రాథాన్యత ఇస్తూ.. ఖమ్మంలోని పలు గ్రామాలను ఏపీలో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇ:దుకు సంబందించిన అంశాన్ని కూడా అప్పట్లో మీడియాకు వెలువరించకుండా ఆఘమేఘాలపై తీసుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ పట్టుబట్టి ఈ గ్రామాలను తమ రాష్ట్రంలో కలుపుకున్నారని కూడా వార్తలు వచ్చాయి.
అయితే అప్పుడు ఎంతో పట్టుబట్టి చేయించిన పనికి అనుకున్నంత ప్రతిఫలం ఇవ్వడం లేదో.. లేక మరే కారణమో తెలియదు కానీ ఇప్పుడు ఆ గ్రామాలను మళ్లీ తెలంగాణలో విలీనం చేయడానికి సిద్దమయ్యారట. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈ విషయమై తాను ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడానని, ఆ గ్రామాలను వెనక్కు ఇచ్చేందుకు ఆయన సమ్మతించారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, అతి త్వరలో గ్రామాలన్నీ తిరిగి తెలంగాణలో కలుస్తాయని, అక్కడి వారికి కావాల్సిన అన్ని రకాల సాయం చేసేందుకు తన ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఖమ్మం జిల్లాను రెండుగా చేసేందుకు కట్టుబడి ఉన్నానని అన్నారు. జిల్లాలో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more