పార్లమెంటు్లో అధికార ఎన్డీఏ ప్రభుత్వం తమకు న్యాయం చేయడం లేదని.. తమకు న్యాయం చేయాలని అటు స్పీకర్ కూడా న్యాయం చేయలేరని భావించిన కాంగ్రెస్.. ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టింది. అయితే అక్కడ కూడా కాంగ్రెస్ కు ఎదురు దెబ్బే తగిలింది. గత పదేళ్ల కాలం పాటు అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ప్రతిపక్ష హోదాకు ఏదైనా పార్టీకి కావాల్సిన 55 సీట్లు కూడా కాంగ్రెస్ కు రాకపోవడంతో ఆ పార్టీకి సదరు హోదాను కల్పించలేమని స్పీకర్ సుమిత్ర మహాజన్ గతంలోనే తేల్చిచెప్పారు.
అంతేకాదు ఇందుకు సంబంధించి గతంలో పార్లమెంటులో ఇలాంటి పరిస్థితులు పునరావృతమైన ఉదంతాలను కూడా పేర్కొంది. అయినా దాంతో సర్థిపెట్లుకోలేక పోయిన కాంగ్రెస్.. తమ అధినేత్రికి ప్రతిపక్ష నాయకురాలిగా హోదా కల్పించాలని డిమాండ్ చేసింది. అంతటితో ఆగకుండా దేశఅత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు తీర్పును వెలువరించిన న్యాయస్థానం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని చెప్పింది. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ప్రతిపక్ష నాయకురాలుగా హోదా కల్పించలేమని చెప్పింది. ఇ:దుకు సంబంధించి కాంగ్రెస్ కు ప్రతిపక్షానికి కావాల్సిన సంఖ్యలో స్థానాలు రాలేదని, ఆ పార్టీకి కేవలం 44 స్థానాలు మాత్రమే రావడంతో హోదా కల్పించలేమని చెప్పింది. దీంతో ఎంతో ఆశగా ఎదురుచూసిన కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more