Guntur Corporation officers Tied Nehru to a tree

Guntur corporation officers tied nehru to a tree

Guntur, Nehru, jawaharlal Nehru, Guntur Muncipal corporation

Guntur Corporation officers Tied Nehru to a tree. Guntur Muncipal corporation officers ashmed of national leaders.

ITEMVIDEOS: పాపం.. పార్కులో నెహ్రూను చెట్టుకు కట్టేశారు

Posted: 02/16/2016 11:12 AM IST
Guntur corporation officers tied nehru to a tree

అవును మీరు  చదువుతున్నది అక్షరాల నిజం. మన తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను గుంటూరులోని ఓ పార్క్ లో చెట్టుకుకట్టేశారు. అది కూడా ఏదో దొంగను కట్టేసినట్లు తీగతో కట్టేశారు. ఏంటీ.. నెహ్రూనా.. ఆయన చనిపోయిన చాలా కాలం అయింది కదా అనుకుంటున్నారా..? అవును ఆయన చనిపోయి చాలాకాలమైంది. అయితే ఆయన విగ్రహాలను చాలా చోట్ల స్పూర్తి కోసం ఉంచుకుంటాం. అలా ఉంచిన ఓ విగ్రహాన్ని తొగలించిన గుంటూరు కార్పోరేషన్ అధికారులు నెహ్రూ విగ్రహాన్ని చెట్టు కట్టేయడం వార్తల్లో నిలిచింది.

గుంటూరులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డు మీద ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలను తొలగించారు. అయితే అలా తొలగించిన విగ్రహాల్లో జవహర్ లాల్ నెహ్రూ, భగత్ సింగ్, రాజీవ్ గాంధీల విగ్రహాలు ఉన్నాయి. కాగా వీటిని గాంధీ పార్కుకు తరలించిన కార్పోరేషన్ అధికారులను వాటిని భద్రపరచడంలో నిర్లక్షం ప్రదర్శించారు. దాంతో భగత్ సింగ్, రాజీవ్ విగ్రహాలను నేలమీదనే వదిలేశారు. ఇక నెహ్రూ గారి నిలువెత్తు విగ్రహం ఉండటంతో.. దాన్ని ఓ చెట్టు పక్కన ఉంచి.. తీగతో కట్టేశారు. మొత్తానికి కార్పోరేషన్ అధికారుల చిత్తశుద్ది ఎంత ఉందో ఇది చూస్తే అర్థమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Guntur  Nehru  jawaharlal Nehru  Guntur Muncipal corporation  

Other Articles