గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పీరియడ్ లో జరిగిన వివాదాస్పద ఘటన మీద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన తాజా పుస్తకం మరోసారి కాకరేపింది. ఇందిరాగాంధీ హత్య, బాబ్రీ మసీదు కూల్చివేత, ఆపరేషన్ బ్లూ స్టార్, రాజీవ్గాంధీ కేబినెట్ నుంచి ఉద్వాసన వంటి పలు కీలకమైన అంశాలను పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావించారు. 1980-1990 మధ్య జరిగిన పలు అభివృద్ధి అంశాలు, స్వాతంత్య్రానంతరం సంభవించిన కల్లోల పరిస్థితులను కూడా అందులో పొందుపరిచారు. 'కల్లోల సంవత్సరాలు:1980-1996' పేరుతో విడుదల చేసిన ఈ పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ. . రాజీవ్గాంధీ కేబినెట్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన విషయాలను కూడా ప్రస్తావించారు. రాజీవ్గాంధీ ప్రధానమంత్రిగా ఎదిగిన కాలం నుంచి పీవీ నరసింహరావు జాతీయ నేతగా వెలుగులోకి వచ్చిన కాలం వరకు పలు ముఖ్యమైన రాజకీయ అంశాలను పుస్తకంలో పొందుపరిచారు.
బాబ్రీ మసీదు విధ్వంసం అనేది నాటి ప్రధాని పి.వి.నరసింహారావు తప్పిదాల్లో అతిపెద్దదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.. బాబ్రీ విధ్వంసం వల్ల ముస్లింల సెంటిమెంట్లను ఆయన దెబ్బతీశారని రాశారు. బాబ్రీని కాపాడలేకపోవడం పీవీ చేతకానితనమన్నారు. బాబ్రీ విధ్వంసంతో భారతీయుల తలలు సిగ్గుతో తలదించుకునేలా అయ్యాయని ప్రణబ్ తన పుస్తకంలో రాశారు. బాబ్రీ విధ్వంసం కాకుండా ఉండేందుకు అన్ని పార్టీల నేతలతో చర్చలు జరిపి కఠిన చర్యలు తీసుకుని ఉండాల్సిందని ప్రణబ్ చెప్పారు. ఆపత్కర పరిస్థితుల్లో మీకు సలహాలు ఇచ్చేవారు ఎవరూ లేరా అని తాను పీవీని అడిగినట్లుగా ప్రణబ్ పుస్తకంలో రాశారు. బాబ్రీ విధ్వంసం వల్ల ముస్లింల సెంటిమెంట్లు దెబ్బతింటాయనే విషయాన్ని గుర్తించలేకపోయారా అని పీవీపై విరుచుకుపడినట్లు రాశారు. అయితే దీనికి జవాబుగా పీవీ ఎప్పటిమాదిరిగానే ఏమీ అర్ధం కాని ఎక్స్ ప్రెషన్ పెట్టారని ప్రణబ్ రాశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more