తమిళనాడు ప్రజలు ఈసారి పొంగల్కు జల్లికట్టు జోరుగా నిర్వహించుకోవచ్చు. ఎద్దుల్ని జనాల మధ్య పరుగెత్తించి తమాషా చూసే ఈ వివాదాస్పదమైన ఆటపై నాలుగేండ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రం సమర్పించుకున్న ఈ పొంగల్ కానుకపై తమిళనాడులో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేసినందుకు ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. అయితే జల్లికట్టు మీద నిషేదాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకన్న నిర్ణయంతో ఏపిలో కోడిపందేల అంశం తెర మీదకు వచ్చింది.
జల్లికట్టు తరహాలోనే మన ఆంధ్రప్రదేశ్లోనూ కొన్ని చోట్ల అలాంటి ఉత్సవాలు జరుగుతుంటాయి. గ్రామాల్లో ఎద్దులు, ఆవుల్ని పరుగులు పెట్టించి, వాటితో పరుగులు పెడ్తుంటారు. ఇక్కడా అనేక సందర్భాల్లో మరణాలో చోటుచేసుకున్నాయి. 'సంప్రదాయ క్రీడ' పేరుతో రక్తం చిందించడంపై జంతు ప్రేమికులు, మానవ హక్కుల సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జల్లికట్టుకు లేని నిషధం కోడి పందాలపై ఎందుకని అంధ్ర ప్రదేశ్ లో పందాలు కట్టేవారు ప్రశ్నిస్తున్నారు. అయితే కోడిపందేల మీద హైకోర్టు తీవ్రంగా మండిపడటంతో ఏపి సర్కార్ కోడిపందేల మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కోర్టుకు వెల్లడించింది. మరి జల్లికట్టుకు లేని నిషేదం కోడిపందేలకు ఎందుకు అని ప్రశ్న వినిపిస్తోంది. పైగా కోడిపందేలు ఎంతో కాలంగా సంప్రదాయంగా కొనసాగుతున్నయని కూడా వాదిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more