లోకకల్యాణం కోసం తలపెట్టిన అయుత చండీ మహాయాగం నాలుగో రోజు వైభవోపేతంగా కొనసాగుతుంది. సీఎం కేసీఆర్, రుత్విజులు ఎరుపు వర్ణం వస్ర్తాలు ధరించారు. గురు ప్రార్థనతో యాగం ప్రారంభమైంది. సప్తద్రవ్యమృత్యుంజయ హోమం, ఏకాదశన్యాసపూర్వక చతుస్సహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, మహాసౌరము, ఉక్తదేవతా జపములు, దంపతీపూజ, మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం ధార్మిక ప్రవచనం, కోటి నవాక్షరీ జపం, అష్టావధాన సేవ, మహా మంగళహారతి, విశేష నమస్కారములు, తీర్థ ప్రసాద వితరణం జరుగుగా, రాత్రి 7.30 గంటలకు శ్రీమాతా భువనేశ్వరి చక్రి భజన జరగనుంది. యాగాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మంత్రి హరీష్రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
అయుత చండీ మహా యాగానికి పలువురు ప్రముఖులు, భక్తజనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇవాళ చండీయాగంకు తమిళనాడు గవర్నర్ కొణిజేటీ రోశయ్య హాజరయ్యారు. రోశయ్యకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎదురెళ్లి ఆహ్వానించారు. యాగశాలలో సీటుపై ఆసీనులైన రోశయ్య యాగాన్ని వీక్షించారు. అనంతరం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా యాగశాలకు విచ్చేశారు. హరీష్ రావు వారిని దగ్గరుండి యాగశాలకు తీసుకువచ్చారు. ఆ తరువాత నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్ ఆయుత చండీ హోమం నిర్వహించే ఎర్రవెల్లికి విచ్చేశారు. అతిరథ మహారధులను సీఎం కేసీఆర్ సాదరంగా స్వాగతించి సన్మానించారు. వీరితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, సినీనటుడు నాగార్జున, ఇతర అతిధులు హాజరయ్యారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more