హిందూ వివాహ చట్టం కింద పెళ్లాడిన పురుషుడికి తన భార్య కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రాథమిక విధి ఉంటుందనీ సుప్రీంకోర్టు పేర్కొంది. అనారోగ్యంపాలైన భార్యకు విడాకుల సెటిల్మెంట్ కింద పరిహారం ఇవ్వజూపడం సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంవై ఇక్బాల్, జస్టిస్ సీ నాగప్పన్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. రొమ్ము కేన్సర్తో బాధపడుతున్న హైదరాబాద్కు చెందిన ఒక మహిళ దాఖలు చేసిన విడాకుల కేసులో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
విడాకులు మంజూరుకు ముందే భర్తకు తన భార్యను ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీరు 2010 ఏప్రిల్లో పెళ్లి చేసుకోగా, మూడేళ్లకే గొడవలు వచ్చి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. విడాకుల శాశ్వత సెటిల్మెంట్ కింద మొత్తం రూ. 12.5 లక్షలు చెల్లించేందుకు భర్త సిద్ధపడగా, దానికి ఆమె అంగీకరించింది. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో ఈ ప్రతిపాదన చేసినప్పటికీ ధర్మాసనం దీనికి సమ్మతించలేదు.
రొమ్ము కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో పిటిషనర్ బాధపడుతున్న దానికి వైద్యం కోసం ఆమె భర్తతో సెటిల్మెంట్కు వచ్చారని భావించిన ధర్మాసనం వారికి విడాకులు మంజూరు చేయడానికి తిరస్కరించింది. ఈ కేసును హైదరాబాద్ కుటుంబ న్యాయస్థానానికి బదిలీ చేసింది. అంతేకాకుండా భర్త పరిహారం కింద ఇవ్వజూపిన రూ.12.5 లక్షల్లో రూ. 5 లక్షలు తక్షణమే ఆమెకు చెల్లించాలని ఆదేశించింది. భార్యకు వ్యాధి నయమైన తర్వాత కుటుంబ న్యాయస్థానం అప్పుడు విడాకుల కేసును పునఃప్రారంభిం చాలని ధర్మాసనం ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more