చిత్తూరు మేయర్ అనురాధ దంపతులపై జరిగిన హత్య తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది. సీమలో మరోమారు పాక్షన్ హత్యలు జరగడం సంచలనం రేపుతోంది. ప్రశాంతంగా వున్న రాష్ట్రంలో అనురాధ అమె భరత్ మోహన్ హత్యలతో పాక్షన్ రక్కసి మళ్లీ పడగ విప్పిందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కిరాయి హంతకులతో ప్రత్యర్ధులను మట్టుబెట్టే సంస్కృతికి.. నేటి రాజకీయాలు కనుమరుగైందని బావిస్తున్న తరుణంలో ఏకంగా మేయర్ హోదాలో వున్న అనురాధను, అమె భర్తను అత్యంత కిరాతకంగా హత్యమార్చిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. అనురాధ, మోహన్ లపై పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని స్థానికులు అరోపిస్తున్నారు.
కార్పొరేషన్ లో నిర్వహించే గ్రీవెన్స్ డే సందర్భంగా మేయర్ కు పలువురు ఫిర్యాదులు, విజ్ఞాపన పత్రాలు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ఐదుగురు వ్యక్తులు మేయర్ కు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని వచ్చారు. వీరిలో నలుగురు బురఖాలు ధరించగా, మిగిలిన వారు మామూలుగానే కార్యాలయంలోకి ఎంటర్ అయ్యారు. మేయర్ ఛాంబర్ లోకి రాగానే వెంటనే తుపాకితో కాల్పులు జరిపారు. మోహన్ పై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అనురాధ అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, మోహన్ తీవ్రంగా గాయపడ్డారు.
Also read : చిత్తూరు మేయర్ హత్య
మరోవైపు తుపాకుల మోత, కత్తులతో దాడి నేపథ్యంలో వినిపించిన హాహాకారాలతో కార్యాలయంలో ఉన్న ప్రజలు, సిబ్బంది షాక్ కు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితుల్లో, తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. దాడి పూర్తయిన వెంటనే దుండగులంతా పారిపోయారు. అయితే మేయర్ అనురాధ, మోహన్ లను టార్గెట్ చేసుకున్న దుండగులు పక్కా ప్రణాళికతోనే హత్యకు పాల్పడి వుంటారని, అంతకుముందే పక్కాగా రెక్కీ నిర్వహించి ఉంటారని భావిస్తున్నారు. దాదాపు 15 రోజుల నుంచి నెల రోజుల పాటు పక్కాగా ప్లాన్ చేసుకుని చేసిన హత్య అని పోలీసులు భావిస్తున్నారు. మేయర్ ఏ సమయానికి కార్పొరేషన్కు వస్తారో అన్నీ ముందుగానే చూసుకుని వచ్చి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి నలుగురు వ్యక్తులు గ్రూపుగా వచ్చి ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more