వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో చిత్తూరులో జన జీవనం స్థంభించింది. ప్రకాశం, కడప జిల్లాలు జలమయమయ్యాయి. దీంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. వర్షాలు పడుతున్న జిల్లాల్లో సహాయక చర్యలకు మంత్రుల బృందాలను నియమించింది. ప్రత్యేకంగా హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. ఏపీలో వరుణుడు సృష్టిస్తున్న బీభత్సం ఇది. మొన్నటి వరకు వర్షాలు లేవని ఎదురుచూసిన ప్రజలను ఇప్పుడు అకాల వర్షాలు ఏడిపిస్తున్నాయి.. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. అటు చెన్నైలోనూ.. ఇటు చిత్తూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కారణంగా ఇప్పటికే పలు రైళ్లు రద్దయ్యాయి. మరోవైపు ఏపీలో రవాణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కడప జిల్లాను అతలాకుతలం చేసింది. రెండు రోజులగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేటలోని నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.
నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి ప్రాంతాల్లో 25 చెరువులకు గండి ఏర్పడింది. నెల్లూరు పెన్నా బ్యారేజ్ దగ్గర నది ఉధృతంగా ప్రవాహిస్తోంది. వెంకటగిరిలో ప్లాట్ ఫారం విరిగి పట్టాలపై పడడంతో భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ ను రైల్వే అధికారులు నిలిపివేశారు. నెల్లూరు నీటి పారుదల శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇళ్లు నీటమునిగాయి. రైల్వేట్రాక్ పై నీళ్లు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలకు ఇవాళ సెలవు ప్రకటించారు. జిల్లాలో 28 చెరువులకు గండ్లు పడ్డాయి. వర్ష బీభత్సంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. అకాల వర్షాలపై కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ జరిపింది. వర్షాలు పడుతున్న ఆయా జిల్లాలకు మంత్రుల బృందాలను ఏర్పాటు చేసింది. నెల్లూరు జిల్లాలకు శిద్ధా రాఘవరావు, నారాయణ.. కడప జిల్లాకు గంటా శ్రీనివాసరావు, చిత్తూరు జిల్లాకు మంత్రులు చిన రాజప్ప, బొజ్జల, పుల్లరావులను పంపాలని నిర్ణయించింది..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more