మహిళలు ఎంత ఉన్నత స్థానంలో వారికి మృగాళ్ల నుంచి ఆగడాలు తప్పవన్న నిఖార్సైన నిజానికి ఈ సంఘటన ఓ నిదర్శనం. ఏకంగా ఓ మహిళా జడ్జినే ఓ న్యాయవ్యాది లైంగికంగా వేధించాడంటే.. సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ న్యాయవాదిపై మహిళా న్యాయమూర్తి తాజాగా ఫిర్యాదు చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
న్యూఢిల్లీలోని ఓ కోర్టులో అక్టోబర్ 30న ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తూ ఆ మరుసటి రోజున ఢిల్లీ పోలీసులకు ట్రాఫిక్ కోర్టు న్యాయమూర్తి ఫిర్యాదు చేసింది. కోర్టులో తనను ఆ న్యాయవాది దుర్భాషలాడాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టును వాయిదా వేయించేందుకు తనపై ఈవిధంగా ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. అంతేకాదు.. తాను విచారణను వాయిదా వేసినా కూడా తనను అసభ్య పదజాలంతో ఆ లాయర్ దుర్భాషలాడాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈమె ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ పోలీసులు.. నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే.. దీనిపై ఆ జడ్జి ఆరోపణలు చేస్తున్న న్యాయవాది స్పందన మాత్రం మరోలా వుంది. అసలు తాను ఆమెను దుర్భాషలాడలేదని, ఆమె తనతో అమర్యాదపూర్వకంగా ప్రవర్తించిందని ఆరోపిస్తున్నాడు.
దీనిపై ఆ న్యాయవాది స్పందిస్తూ తన క్లయింట్ డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడటంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పాడు. జరిమానా చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని న్యాయమూర్తి తీర్పునివ్వడంతో తన క్లయింట్ అరగంట సమయం అడిగినట్లు పేర్కొన్నాడు. అనంతరం జరిమానాను చెల్లించేందుకు వెళ్లగా మరుసటి రోజు రావాలని న్యాయమూర్తి ఆదేశించగా, తాను అడ్డుకొని నిబంధనలను పాటించాలని ఆమెకు సూచించినట్లు తెలిపాడు. దీంతో ఆమె తమతో అమర్యాదపూర్వకంగా ప్రవర్తించారని న్యాయవాది పేర్కొన్నాడు. దీంతో ఆమెపై జిల్లా జడ్జితో పాటు బార్ అసోసియేషన్లో ఫిర్యాదు చేశానని, ఆ మరుసటి రోజున ఆమె తనపై ఫిర్యాదు చేసిందని తెలిపాడు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more