Telangana government transfers GHMC commissioner Somesh Kumar

Telangana government transfers ghmc commissioner somesh kumar

GHMC, Hyderabad, Telangana, GHMC commissioner, Somesh Kumar, IAS officers

A major reshuffle is on cards in Telangana and orders to this effect are likely to be issued now. The Opposition parties in the state have been alleging that Somesh Kumar removed nearly 7 lakh votes so far and issued notices to another 19 lakh voters for deletion of votes.

జీహెచ్ఎంసీ కమీషనర్ సోమేష్ బదిలీ

Posted: 10/31/2015 08:41 AM IST
Telangana government transfers ghmc commissioner somesh kumar

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ ఫర్ చేసింది సర్కార్. 22 మంది అధికారులను బదిలీ చేసింది. ఇందులో వివిధ శాఖల  హెచ్ఓడీలు కూడా ఉన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ను… ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గా బదిలీ చేసింది. 22 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ ఫర్ చేస్తూ… శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. ప్రభుత్వంలో కీలకమైన ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శలకు కూడా బదిలీలు తప్పలేదు. 20 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా… మరో ఇద్దరికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

జిహెచ్ఎంసి  కమిషనర్ సోమేశ్ కుమార్ ను … ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గా ట్రాన్స్ ఫర్ చేసింది ప్రభుత్వం. ఆయన ప్లేసులో….. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న జనార్దన్ రెడ్డిని జిహెచ్ఎంసీ కమిషనర్ గా నియమించింది. ప్రభుత్వంలో కీలకంగా ఉండే సిసిఎల్ఎగా రేమండ్ పీటర్ కు పోస్టింగ్ ఇచ్చింది సర్కార్. ఎఛ్ఎండిఎ కమిషనర్ గా చిరంజీవులు, అటవీ శాఖ కార్యదర్శిగా వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ ప్రత్యేక కార్యదర్శిగా ఎస్పీ సింగ్, ఐఅండ్ పీఆర్ కమిషనర్ గా నవీన్ మిట్టల్, పురపాలక శాఖ కమిషనర్ గా దాన కిషోర్ బదిలీ అయ్యారు. సెర్ప్ సీఈఓగా వీర బ్రహ్మయ్యకు అదనపు బాద్యతలు అప్పగించింది ప్రభుత్వం.

జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ గా జి.కిషన్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా అనితా రామచంద్రన్, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎండీగా కె.నిర్మల, పురపాలక శాఖ సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాస్, ఆయిల్ ఫెడ్ ఎండీగా మురళి, సాంకేతిక శాఖ సంచాలకులుగా ఎంవీ రెడ్డికి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ట్రైకార్ ఎండీగా ఆర్. లక్ష్మణ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా రాజేశ్వర్ తివారీ, పశు సంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శిగా సురేశ్ చందా, సాధారణ పరిపాలన శాఖ రాజకీయ కార్యదర్శిగా అదర్ సిన్హా, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ గా జీడీ అరుణ, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా మహేష్ దత్ నియమితులయ్యారు. సొంత సర్వేలు, అధికారుల పనితీరుపై వివిధ రకాలుగా సేకరించిన ఫీడ్ బ్యాక్ తో.. ఐఏఎస్ అధికారుల బదిలీలు చేసినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  Hyderabad  Telangana  GHMC commissioner  Somesh Kumar  IAS officers  

Other Articles