ప్రస్తుత ఆధునిక యుగంలో పురుషులకు సమానంగా మహిళలూ అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారంటే ఏమో అనుకున్నాంగానీ.. మోసాలు చేయడంలోనూ వారు తమకు తామే సాటిగా నిలిచిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వంటబట్టిన కొందరు మహిళలు దాన్నే అడ్డం పెట్టుకుని దొడ్డిదారిన డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పటికే ఎందరో హైటెక్ మహిళలు పలు మోసాలు చేసి పట్టుబడగా.. తాజాగా మరో మహిళ ‘మ్యారేజ్ బ్యూరో’ పేరిట ఎంతోమందికి టోకరా వేసింది. వివిధ కులాల వారికి పెళ్లి సంబంధాలంటూ పత్రికల్లో ప్రకటనలిచ్చి మోసాలకు పాల్పడుతున్న ఆ మహిళను సీసీఎస్ ఆధీనంలోని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు.
హైదరాబాద్లోని అంబర్పేట్ ప్రాంతానికి చెందిన సరిత స్థానికంగా ‘శ్రీరస్తు మ్యారేజ్ బ్యూరో’ నిర్వహిస్తోంది. వివిధ తెలుగు పత్రికల్లోని ప్రత్యేక ఎడిషన్లలో కులాలవారీగా పెళ్లి సంబంధాలున్నాయంటూ ఫోన్ నెంబర్లతో సహా ప్రకటనలు ఇచ్చేది. వీటిలో ఉన్న ఫోన్ నెంబర్లో ఎవరైనా సంప్రదిస్తే... వారి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.2,000 నుంచి రూ.5,000 వరకు వసూలు చేసేది. ఆపై వారి ఆసక్తిని బట్టి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫొటోలు, నకిలీ ప్రొఫైల్స్ పంపేది. రకరకాల కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ చివరకు సదరు వ్యక్తికి వివాహమైందని, మరో ప్రొఫైల్ పంపిస్తున్నానని నమ్మబలికేది. మళ్లీ అదే తతంగాన్ని ‘నకిలీ’ తతంగాన్ని రిపీట్ చేసేది. ఈ విధంగా ఆమె సృష్టించే కట్టకథలకు విసిగిపోయిన కొందరు వ్యక్తు.. చివరికి వదిలేసేవారు. ఇలా ఎంతోమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నవాళ్లు ఆమె చేతిలో మోసపోయారు. దీంతో కొందరు బాధితులు ఆమెపై అనుమానం కలిగి ఫిర్యాదు చేశారు.
ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్న సరిత వ్యవహారాలపై సమాచారం అందుకున్న మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇన్స్పెక్టర్ శంకర్ రాజు నేతృత్వంలోని బృందం లోతుగా ఆరా తీసింది. నలుగురు బాధితుల్ని గుర్తించిన మీదట నిందితురాలిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. బాధితుల సంఖ్య 150కి పైగా ఉంటుందని, వారిలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సీసీఎస్ అధికారులు చెప్పారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more