అమరావతి శంకుస్థాసనకు పవన్ కల్యాణ్ వస్తారా.? రారా..? అన్న సందిగ్దానికి మంత్రులు తలా ఓ మాట మాట్లాడుతున్నారు. ఏపి మంత్రులు పవన్ వస్తారనే హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. తనకు రావాలనే ఉంది అని పవన్.. అమరావతి శంఖుస్థాపన ఆహ్వానం అందుకున్నాక ప్రకటించారు. ఏపీ నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పక వస్తారని తాము ఆశిస్తున్నామని తాజాగా ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అమరావతి శంకుస్థాపనకు రావాలని ఉన్నా.. అదే సమయంలో షూటింగ్ ఉందని పవన్ కల్యాణ్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ హాజరుపై సందేహాలు నెలకొన్నాయి.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి యనమలకు.. అమరావతి శంకుస్థాపన కోసం నీలకంఠేశ్వరస్వామి ఆలయం మట్టిని, నిజాంసాగర్ మట్టిని జిల్లా టీడీపీ నేతలు అందించారు. ఏపీ ప్రజలు గర్వపడేలా అమరావతి నిర్మాణం ఘనంగా చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాజధాని శంకుస్థాపనకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామన్న మంత్రి యనమల..వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై ఫైర్ అయ్యారు. రాజధాని శంకుస్థాపన ఆహ్వానాన్ని జగన్ నిరాకరించడం సిగ్గుచేటన్నారు. జగన్ నిర్ణయాన్ని వైసీపీ నేతలే తప్పుపడుతున్నారని యనమల చెప్పారు. జగన ఓ సైకో నేత అన్న ఆయన.. శంకుస్థాపకు రావడం రాకపోవడం ఆయన ఇష్టమన్నారు. ప్రజలు విడిపోయినా తెలుగు రాష్ట్రాల ఔన్నత్యమే టీడీపీ లక్ష్యంమని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు తక్కువ ఖర్చుతోనే భూమిపూజ ఘనంగా నిర్వహిస్తామని మంత్రి వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more