తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటూ తీవ్రంగా హెచ్చరించారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మీద చేసిన విమర్శలను తలసాని శ్రీనివాస్ ఖండించారు. హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుంటే.. మీకు మాత్రం లావు బియ్యలాగా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. దొరల పంచన చేరిన ఈటెల కూడా అలానే తయారయ్యారని రేవంత్ వ్యాఖ్యాలను తలసాని వ్యతిరేకించారు. కాగా నోటికి తోచింది మాట్లాడితే తాను ఊరుకున్నా.. తన వాళ్లు మాత్రం ఊరుకోరని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు తలసాని. కోడి గుడ్డు మీద రేవంత్ రెడ్డి ఈకలు పీకే ప్రయత్నాలు మానుకోవాలని తలసాని హితవు పలికారు.
హాస్టల్ విద్యార్థులకు లావు బియ్యం కాకుండా కేవలం సన్న బియ్యం మాత్రమే పంపిణీ చెయ్యాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నిర్ణయం వెనుక ఈటెల రాజేందర్ కృషి ఉంది. ఈటెల హాస్టల్ విద్యార్థులకు మంచి భోజనం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ నిజానికి సన్న బియ్యం పేరుకు మాత్రమే అని లావు బియ్యాన్నే ప్రభుత్వం పంపిణీ చేస్తోందని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈటెల అంటే తనకు గౌరవమేనని .. కానీ హాస్టల్ విద్యార్థులకు పంపిణీ చేస్తున్న బియ్యం విషయంలో మాత్రం అన్యాయం జరుగుతోందని అన్నారు. కావాలంటే ఈటెల రాజేందర్ తన నియోజక వర్గమైన కొడంగల్ కు వస్తే హాస్టల్ కు వెళ్లి వాస్తవాలను నిరూపిస్తానని అన్నారు రేవంత్ రెడ్డి. మొత్తంగా హాస్టల్ విద్యార్థులకు పంపిణీ చేస్తున్న బియ్యం వ్యవహారం రేవంత్ రెడ్డి, ఈటెల, తలసాని మధ్య మాటల యుద్దానికి తెర తీసింది. మరి రేవంత్ రెడ్డి సవాల్ కు ఈటెల సిద్దపడతారో లేదో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more