బీహార్ లో మొదటి దశ ఎన్నికలు నిన్న జరిగాయి. అయితే బీహార్ లో ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వస్తాయంటే.. లేదు లేదు మా పార్టీకి అనుకూలంగా వస్తాయంటూ పార్టీ నాయకులు వాదించుకుంటున్నారు. అయితే తాజాగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రభంజనం స్పష్టంగా కన్పిస్తోందని, తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీయే ఏర్పాటు చేస్తుందని ములాయం జోస్యం చెప్పారు. ఈ నేపధ్యంలో ఎస్పీ చీఫ్ ములాయం ఈ వ్యాఖ్య చేసి జేడీయూ- ఆర్జేడీ – కాంగ్రెస్ అలయన్స్ ను చిక్కుల్లో పడేశారు. కాషాయ పార్టీ ప్రభుంజనం కన్పిస్తోందని.. బీజేపీ పార్టీయే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం చేసే మంచిపనులను తాను మెచ్చుకుంటానని కూడా ములాయం తెలిపారు. పశుగ్రాసం కుంభకోణంలో కోర్టు శిక్ష విధించిన లాలూప్రసాద్ యాదవ్ తో అవినీతిని వ్యతిరేకించే నితిశ్ కుమార్ చేతులు కలపడాన్ని ఆయన సన్నిహితులే జీర్ణించుకోలేకపోతున్నారని, ఆర్జేడీ చీఫ్ లాలూను జేడీయూ నేత బుట్టలో వేశారని ములాయం ఎద్దేవా చేశారు. నితిశ్ కుమార్ , లాలూ ప్రసాద్ యాదవ్ జనతా పరివార్ పునరుద్ధరణ ఏర్పాట్లను దెబ్బతీశారని సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం విమర్శించారు.
బీహార్ లో మొదటి దశ ఎన్నికలు ముగివాయో లేదో వెంటనే లో రెండో విడత ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. బీహార్ లో ఓడిపోతే ప్రధాని పదవికి నరేంద్ర మోడీ రాజీనామా చేయగలరా అని ఆర్జేడీ అధినేత సవాల్ చేశారు. మూడు నెలలుగా బీహార్ లో ప్రచారం చేస్తున్న మోడీ.. ఫలితాల తర్వాత ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. మరోవైపు 25 ఏళ్ల నుంచి బీహార్ ను పాలిస్తున్న పెద్దన్న, చిన్నన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారని పరోక్షంగా లాలూ, నితీష్ ల మీద ప్రధాని మోడీ ఆరోపించారు. అభివృద్ధి కోరితే బీజేపీని గెలిపించండని కోరారు. జెహానాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. మహాకూటమి నేతలకు చురకలంటించారు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కిబాత్ కార్యక్రమం ద్వారా ప్రజలను ఆకట్టుకుంటానంటూ కార్యక్రమాన్ని ఆపేసేందుకు మహా కూటమి నేతలు తీవ్రయత్నాలు చేశారని మోడీ విమర్శించారు. తన మన్ కీ బాత్ కార్యక్రమంతో కూడా మహాకూటమి నేతల్లో భయం నెలకొందని ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more