బాగ్యనగరంగా బాసిల్లుతున్న హైదరాబాద్ మహానగరంలో రోజుకో రకంగా మోసం చేసే మాయగాళ్లకు కొదవలేకుండా పోయింది. కొత్త కొత్త పంథాలో దోపిడీలు, దోంగతనాలు చేసి.. ఈజీ మనీ కోసం ఎగబడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటం.. అందుకు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా భద్రత కల్పించడంతో.. ఇక రోడ్లపైన పోలీసులు తక్కువ సంఖ్యలోనే గస్తి వుంటున్నారని భావించారో ఏమో తెలియదు కానీ మంగళవారం ఒక్కటే రోజున చైన్ స్నాచింగ్ ముఠాలు నగరంపై తెగబడ్డారు. ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి వేగంగా వచ్చి... రోడ్డుపై నడుచుకుని వెళుతున్న మహిళల మెడలోని నగలు క్షణాల్లో లాక్కొని పరారవుతున్నారు.
తాజాగా దుండగులు మంగళవారం ఒక్కరోజే పదికి పైగా బంగారు గొలుసుల చోరీలకు పాల్పడ్డారు. కేపీహెచ్బీ, ఎస్ఆర్ నగర్, ఫిల్మ్నగర్ ప్రాంతాల్లోని ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా చేసుకుని... తమ ప్రతాపాన్ని చూపించారు. మహిళలు ఒంటరిగా కనిపించటమే ఆలస్యం... వారు తమ ప్రతాపం చూపిస్తున్నారు. కూకట్పల్లిలోని ధర్మారెడ్డికాలనీ, వివేకానందా నగర్లోని రెండు ఘటనల్లో ఆరు తులాల బంగారు గొలుసులు అపహరించారు. ఇక సనత్నగర్, ఎస్ఆర్ నగర్, ఫిల్మ్నగర్, దోమలగూడా, అశోక్నగర్లలో 21 తులాల బంగారాన్ని తెంచుకు వెళ్లారు. అంతర్ రాష్ట్ర ముఠాలకు చెందిన పాతనేరస్తుల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వరుస ఘటనలతో మహిళలు రోడ్లపైకి రావడానికి వణికిపోతున్నారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను పోలీసులు రంగంలోకి దించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more